News March 9, 2025

నాటు సారా రహిత జిల్లాగా శ్రీకాకుళం: కలెక్టర్

image

నాటు సారా రహిత జిల్లాగా శ్రీకాకుళాన్ని తీర్చిదిద్దేందుకు కృషిచేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వం చేపట్టిన నవోదయం వెలుగు 2.0 పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ప్రస్తుతం జిల్లాలో 110 గ్రామాలను నాటు సారా ఊరులగా గుర్తించామన్నారు. వీటిని ఏ, బీ, సీ, లుగా విభజించి సారాతో కలిగే అనర్థాలపై అవగాహన సదస్సు నిర్వహిస్తామన్నారు. 

Similar News

News October 27, 2025

శ్రీకాకుళం: ‘విద్యుత్ సరఫరా అంతరాయానికి ఈ నంబర్లను సంప్రదించండి’

image

మొంథా తుఫాను కారణంగా జిల్లాలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని విద్యుత్ శాఖ ఎస్ఈ నాగిరెడ్డి క్రిష్ణమూర్తి తెలిపారు. సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తుఫాను పరిస్థితులను పర్యవేక్షించేందుకు శ్రీకాకుళం, టెక్కలి డివిజన్‌లో 9490610045, 9490610050 హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసిమనిన్నారు. విద్యుత్ లైన్లు తెగిపడినా.. స్తంభాలు పడిపోయిన తదితర సమస్యలు ఎదురైతే ఈ నంబర్లను సంప్రదించాలని కోరారు.

News October 27, 2025

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా ప్రత్యేక అధికారి పర్యటన

image

పోలాకి మండలం తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా ప్రత్యేక అధికారి చక్రధర బాబు సోమవారం పరిశీలించారు. డీఎల్ పురంలో గ్రామస్థులతో మాట్లాడారు. అధికారుల ఆదేశాలను తప్పనిసరిగా అందరూ పాటించాలని విజ్ఞప్తి చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్, ఎస్పీ కెవీ మహేశ్వర రెడ్డి, రెవెన్యూ, పంచాయతీ రాజ్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

News October 27, 2025

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కుమారుడి పేరు ఇదే..!

image

కేంద్ర పౌర విమానాయన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కుమారుడికి నామకరణం మహోత్సవం ఢిల్లీలో ఆదివారం నిర్వహించారు. రామ్మోహన్ కుమారుడికి శివన్ ఎర్రం నాయుడు అని నామకరణం చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు కేంద్ర మంత్రులు, జీఎంఆర్ సంస్థల అధినేత, శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్యేలు హాజరయ్యారు. రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చం నాయుడు, ఎర్రం నాయుడు సోదరులు, కింజరాపు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.