News March 30, 2024

నాడు వైసీపీ ప్రభుత్వంలో మంత్రి.. నేడు TDP MLA అభ్యర్థి

image

జగన్ కేబినెట్‌లో మొన్నటి వరకు ఉన్న గుమ్మనూరు జయరాం, YCPని వీడిన విషయం తెలిసిందే. TDPలో చేరిన ఆయనకు నిన్న చంద్రబాబు గుంతకల్లు టికెట్ కేటాయించారు. YCPలో ఆయనకు కర్నూలు MP టికెట్ ఇచ్చినా వద్దనుకొని ఆలూరు టికెట్ కోసం ప్రయత్నించారు. ఆపై ఆ పార్టీనే వీడారు. ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఆలూరు టికెట్‌ను టీడీపీ వీరభద్ర గౌడ్‌కు ఇచ్చింది. ఈయన పక్క నియోజకవర్గం గుంతకల్లు నుంచి బరిలో దిగుతున్నారు.

Similar News

News February 8, 2026

వ్యర్థాల నిర్వహణ సమర్థవంతంగా నిర్వహించాలి: కలెక్టర్

image

కలెక్టరేట్‌లో వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్ అంశాలపై మున్సిపల్ కమిషనర్లతో కలెక్టర్ సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిర్దేశాల ప్రకారం వ్యర్థాల నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించాన్నారు. పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలన్నారు. తడి చెత్తను సాంకేతిక పద్ధతి ద్వారా వ్యవసాయ ఎరువుగా మార్చాలన్నారు. డంపింగ్ యార్డులలో పేరుకుపోయి ఉన్న వ్యర్థాలను శుభ్రం చేయించాలన్నారు.

News February 7, 2026

రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యం: ఎస్పీ

image

రహదారి ప్రమాదాల నియంత్రణ లక్ష్యంగా ప్రతీ శనివారం రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ల పరిధిలో ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించారు. మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. హెల్మెట్ ధరించడం తప్పనిసరి, ఓవర్ స్పీడ్, ఓవర్ లోడ్, డ్రంకెన్ డ్రైవ్ చేయరాదని తెలిపారు.

News February 7, 2026

ఏపీపీఎస్సీ పరీక్షల ఏర్పాట్లపై సమీక్ష

image

జిల్లాలో ఏపీపీఎస్సీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కర్నూల్ డీఆర్‌వో వెంకట నారాయణమ్మ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఆమె చాంబర్లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులు, భద్రతా ఏర్పాట్లు, తాగునీరు, వైద్య సదుపాయాలు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. రవాణా, విద్యుత్, పోలీసు శాఖలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.