News December 2, 2024
నాణ్యమైన విద్యతో పేదరికాన్ని నిర్మూలన: హరగోపాల్

ప్రభుత్వాలు బడ్జెట్లో విద్యకు అవసరమయ్యే నిధులు కేటాయించాలని ప్రొఫెసర్ హరగోపాల్ సూచించారు. షాద్ నగర్ పట్టణంలో ఆయన మాట్లాడుతూ.. నాణ్యమైన విద్యతో పేదరికాన్ని నిర్మూలించవచ్చని అన్నారు. ప్రభుత్వాలు విద్యకు నిధుల కేటాయింపులు తగ్గిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య విధ్వంసానికి కారణాలను వెతికి పేదలకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలని సూచించారు.
Similar News
News February 9, 2025
జడ్చర్ల: రేపటి ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొననున్న ఎస్పీ

జడ్చర్ల సర్కిల్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డి .జానకి పాల్గొననున్నట్లు జిల్లా ఎస్పీ కార్యాలయం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలకు అందుబాటులో ఉండి ఫిర్యాదులు స్వీకరిస్తారని, వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను తెలపాలని కోరారు.
News February 8, 2025
షాద్నగర్: 10న అప్రెంటిస్ షిప్ మేళా

షాద్నగర్ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈనెల 10వ తేదీన అప్రెంటిస్ షిప్ మేళాను నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ లక్ష్మణ్ తెలిపారు. ఉదయం 10 గం.లకు కళాశాలలో ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ షిప్ మేళా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మహబూబ్నగర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులు పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.
News February 8, 2025
వనపర్తి: చికిత్స పొందుతూ మహిళ మృతి

ఈ నెల 2వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. జోగులాంబ అమ్మవారిని దర్శించుకుని తిరిగి హైదరాబాద్కు బయలుదేరిన చంద్రమోహన్, లక్ష్మమ్మల కారు కొత్తకోట ముమ్మళ్లపల్లి స్టేజీ వద్ద రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో లక్ష్మమ్మకు తీవ్ర గాయాలు కాగా.. HYDలోని నిమ్స్లో చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయింది. ఈ మేరకు కేసు నమోదైంది.