News February 1, 2025
నాణ్యమైన విద్య అందించాలి: ASF అదనపు కలెక్టర్

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. ఆసిఫాబాద్ గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి వంటశాలతో పాటు విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. గిరిజన విద్యార్థుల అభివృద్ధి కోసం కృషి చేయాలన్నారు. నాణ్యమైన విద్యతో పాటు మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు. పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకురాగా పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు.
Similar News
News October 13, 2025
ఏ విచారణకైనా నేను సిద్ధం: సుధీర్ రెడ్డి

మర్డర్ జరిగే వరకు రాయుడు ఎవరో తనకు తెలియదని శ్రీకాళహస్తి MLA సుధీర్ రెడ్డి అన్నారు. ‘నిన్ననే రాయుడి వీడియో చూశా. బెదిరించి వీడియో తీయించారా? లేక అది ఫేక్ వీడియో? అనేది తెలియాల్సి ఉంది. డిపాజిట్ కూడా రాని వినూత వీడియోలు తీసుకుని నేను ఏం చేస్తా. ఎన్నికల్లో నా కోసం వినుత దంపతులు పని చేయలేదు. ఏ విచారణకైనా నేను సిద్ధం. ఎక్కడికైనా వస్తా. ఇలా బురదజల్లే వారిని వదిలిపెట్టను’ అని ఢిల్లీలో MLA అన్నారు.
News October 13, 2025
ఎన్సీడీ స్క్రీనింగ్ త్వరగా పూర్తి చేయాలి: డీఎంహెచ్ఓ

భద్రాద్రి జిల్లాలో సంక్రమణ రహిత వ్యాధుల (నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ – ఎన్సీడీ) స్క్రీనింగ్ కార్యక్రమాలను సమయానికి పూర్తి చేయాలని డీఎంహెచ్ఓ ఎస్. జయలక్ష్మి అధికారులను ఆదేశించారు. సోమవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. స్క్రీనింగ్ నిర్వహించి, ఆన్లైన్ డేటాను ఆలస్యం లేకుండా నమోదు చేయాలని ఆమె సూచించారు.
News October 13, 2025
ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు డా.శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డిలతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. జిల్లా కలెక్టర్ ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.