News February 14, 2025

నాదెండ్ల: విద్యార్థిని బలవర్మరణం.. కేసు నమోదు

image

నాదెండ్ల మండలం చందవరం గ్రామానికి చెందిన 16 సంవత్సరాల విద్యార్థిని ఒంటిపై కిరోసిన్ పోసుకొని బలవణ్మరణానికి పాల్పడింది. నరసరావుపేట వైద్యశాలలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నాదెండ్ల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. స్నేహితులతో కలిసి కోటప్పకొండ వెళ్లిన విద్యార్థినిని ఉపాధ్యాయులు మందలించటంతో మనస్తాపంతో ఒంటిపై కిరోసిన్ పోసుకుంది. 

Similar News

News November 25, 2025

HZB: పేదలకు మెరుగైన వైద్యం అందజేయాలి: బండి

image

కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సోమవారం హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి సందర్శించారు. సుమారు కోటిన్నర రూపాయల విలువైన ఆధునిక వైద్య పరికరాలను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి వైద్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

News November 25, 2025

KNR: భవన నిర్మాణ కార్మికులకు అవగాహన సదస్సులు

image

భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై పది రోజుల పాటు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఉప కార్మిక కమిషనర్ తెలిపారు. లేబర్ కమిషనర్ హైదరాబాద్ ఆదేశాల మేరకు డిసెంబర్ 3 వరకు ఈ సదస్సులు జరుగుతాయి. ప్రమాద బీమా, సహజ మరణం, పెళ్లి కానుక, ప్రసూతి లబ్ధి వంటి అంశాలపై నిర్వహించే ఈ సదస్సులను కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

News November 25, 2025

ఈనెల 26న జిల్లా అధికారుల సమీక్ష: కలెక్టర్

image

జిల్లా సమీక్షా సమావేశాన్ని ఈనెల 26న రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన నిర్వహించనున్నట్లు ఏలూరు కలెక్టర్ వెట్రి సెల్వి సోమవారం తెలిపారు. ఈ సమావేశంలో ధాన్యం కొనుగోలు, గృహ నిర్మాణం, 22A కేసులు, ఇటీవల విశాఖపట్నంలో జరిగిన సీఐఐ సమ్మిట్ తదితర అంశాలపై సమీక్షిస్తారన్నారు. జిల్లాకు సంబంధించిన నాయకులు, ప్రతినిధులు, అధికారులు పాల్గొంటారన్నారు.