News February 14, 2025
నాదెండ్ల: విద్యార్థిని బలవర్మరణం.. కేసు నమోదు

నాదెండ్ల మండలం చందవరం గ్రామానికి చెందిన 16 సంవత్సరాల విద్యార్థిని ఒంటిపై కిరోసిన్ పోసుకొని బలవణ్మరణానికి పాల్పడింది. నరసరావుపేట వైద్యశాలలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నాదెండ్ల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. స్నేహితులతో కలిసి కోటప్పకొండ వెళ్లిన విద్యార్థినిని ఉపాధ్యాయులు మందలించటంతో మనస్తాపంతో ఒంటిపై కిరోసిన్ పోసుకుంది.
Similar News
News October 16, 2025
ASF: ఆర్థిక స్థోమత లేని ఖైదీలకు ఉచిత న్యాయ సేవలు

ఆర్థిక స్థోమత లేని ఖైదీలకు ఉచిత న్యాయ సేవలు అందిస్తామని ASF జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేష్ అన్నారు. బుధవారం జన్కాపూర్ సబ్ జైలు అధికారులతో సమావేశం నిర్వహించారు. జైలులో ఖైదీలకు కల్పిస్తున్న సౌకర్యాలు, వారి ఆరోగ్య వివరాలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఖైదీల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు.
News October 16, 2025
సంగారెడ్డి: 23 వరకు ఓపెన్ స్కూల్ అడ్మిషన్ గడువు పెంపు

ఓపెన్ స్కూల్ విధానంలో పది, ఇంటర్ అడ్మిషన్ గడువు ఈనెల 23వ తేదీ వరకు పెంచినట్లు ఉమ్మడి జిల్లా సమన్వయకర్త వెంకటస్వామి బుధవారం తెలిపారు. సమీపంలోని అధ్యయన కేంద్రాలు అడ్మిషన్ కోసం సంప్రదించాలని పేర్కొన్నారు. అడ్మిషన్ రుసుం మీసేవ కేంద్రాల్లో మాత్రమే చెల్లించాలని చెప్పారు. గడువు పెంపును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News October 16, 2025
అక్టోబర్ 16: చరిత్రలో ఈ రోజు

1916: నటుడు, క్రీడాకారుడు దండమూడి రాజగోపాలరావు జననం
1948: నటి, రాజకీయ నాయకురాలు హేమా మాలిని జననం
1958: రచయిత తెన్నేటి సూరి మరణం
1982: మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ జననం
1984: భారతదేశంలో జాతీయ భద్రతా దళం (NSG) ఏర్పాటు
1990: నెల్సన్ మండేలాకు భారతరత్న పురస్కారం
1990: మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ జననం
*ప్రపంచ ఆహార దినోత్సవం