News April 29, 2024
నామా నాగేశ్వరరావు కేంద్ర మంత్రి అవుతారు: కేసీఆర్

ఖమ్మంలో నిర్వహించినoచిన రోడ్ షోలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతుందన్నారు. బీఆర్ఎస్కు 12 ఎంపీ సీట్లు వస్తాయని చెప్పారు. సంకీర్ణ ప్రభుత్వంలో నామా నాగేశ్వర్ రావు కేంద్ర మంత్రి అవుతారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీజేపీకి ఓట్లు, సీట్లు తప్ప ప్రజా సమస్యలు పట్టవని విమర్శించారు.
Similar News
News April 15, 2026
ఆర్టీసీ బస్సు ఢీకొని సీపీఐ నేత మృతి

తల్లాడ మండలంలోని నరసింహరావుపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సీపీఐ మండల కార్యదర్శి ఓర్సు రమేష్ దుర్మరణం చెందారు. ఆర్టీసీ బస్సు ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. రమేష్ మృతితో మండలంలో విషాదఛాయలు అలముకొన్నాయి. ఆయన మరణం పార్టీకి తీరని లోటని సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ సంతాపం వ్యక్తం చేశారు.
News April 15, 2026
ఆర్టీసీ బస్సు ఢీకొని సీపీఐ నేత మృతి

తల్లాడ మండలంలోని నరసింహరావుపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సీపీఐ మండల కార్యదర్శి ఓర్సు రమేష్ దుర్మరణం చెందారు. ఆర్టీసీ బస్సు ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. రమేష్ మృతితో మండలంలో విషాదఛాయలు అలముకొన్నాయి. ఆయన మరణం పార్టీకి తీరని లోటని సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ సంతాపం వ్యక్తం చేశారు.
News April 14, 2026
గ్రామస్థాయి నుంచి కాంగ్రెస్ బలోపేతం కావాలి: టీపీసీసీ చీఫ్

ఖమ్మం డీసీసీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జెండా ఆవిష్కరించి, ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా ఈ దేశంలో ప్రధాన పాత్ర పోషిస్తోందని చెప్పారు. ఖమ్మం జిల్లా.. కాంగ్రెస్కి ఎప్పుడూ అండగా నిలిచిందని అన్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతం కావాలని పిలుపునిచ్చారు.


