News April 24, 2024

నామినేషన్ కాదు.. అభివృద్ధికి శంకుస్థాపన: వీపీఆర్

image

ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి నామినేషన్‌ వేయడం చాలా సంతోషంగా ఉందని టీడీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. నామినేషన్ వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది నామినేషన్‌ కార్యక్రమం అనేకంటే నెల్లూరు జిల్లా అభివృద్ధికి శంకుస్థాపన కార్యక్రమం అనొచ్చని ఆయన వ్యాఖ్యానించారు.

Similar News

News November 22, 2025

ఆత్మకూరు: పెన్నా నదిలో చిక్కుకున్న ఆరుగురు

image

ఆత్మకూరు మండలం అప్పారావుపాలెం వద్ద పెన్నానదిలో ఆరుగురు పశువుల కాపర్లు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఉదయం గ్రామం నుంచి పశువులు మేపుకునేందుకు నదిలోకి వెళ్లిన కాపర్లు ఒక్కసారిగా వచ్చిన నీటి ప్రవాహంతో నది మధ్యలో చిక్కుకున్నారు. వారిలో వెంకట రమణయ్య, శ్రీనివాసులు, కాలేషా, కవిత, చెన్నయ్యతోపాటు మరో మహిళ ఉన్నట్లు సమాచారం. వీరిని కాపాడేందుకు పోలీసులు రంగంలో దిగారు.

News November 22, 2025

మార్చి 16 నుంచి 10వ తరగతి పరీక్షలు: డీఈవో

image

వచ్చే ఏడాది మార్చి 16వ తేదీ నుంచి పదవ తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఆర్ బాలాజీ రావు ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12. 45 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని ఉపాధ్యాయులు ఈ విషయాన్ని గమనించి 10వ తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణత వచ్చేలా కృషి చేయాలని కోరారు.

News November 22, 2025

నెల్లూరు: డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.23 లక్షల స్వాహా

image

నెల్లూరు రూరల్‌లోని శాస్త్రవేత్తకు సైబర్ నేరగాళ్ల సెగ తగిలింది. CBI పేరుతో డిజిటల్ అరెస్టుకు పాల్పడి అతని వద్ద నుంచి రూ.23 లక్షలు స్వాహా చేశారు. మహిళలకు అసభ్యకరమైన ఫొటోలు పంపించినందుకు తాము అరెస్టు చేస్తున్నట్లు బెంగళూరు నుంచి CBI అధికారుల పేరుతో కాల్ చేసి భయపెట్టారు. బాధితుడు రూ.23 లక్షలు చెల్లించి మోసపోవడంతో వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేయగా..వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.