News April 19, 2024

నామినేషన్ దాఖలు చేసిన వంశీ చంద్ రెడ్డి

image

మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వంశీచంద్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే ఎన్నెం శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ హాజరయ్యారు. ఉదయం వంశీ చంద్ రెడ్డికి మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి ర్యాలీ నిర్వహించారు.

Similar News

News November 17, 2025

HYD: బస్సుల సంఖ్య పెంచాలని డిమాండ్

image

నగరంలో పెరుగుతున్న కాలనీలు, జనాభా, మహాలక్ష్మి ఉచిత బస్సు పథకంతో ప్రయాణికుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దీంతో పలు ప్రాంతాల్లో బస్సు సర్వీసులు పెంచాలంటూ డిమాండ్లు కూడా పెరుగుతున్నాయి. కుత్బుల్లాపూర్, ఘట్కేసర్, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, మేడ్చల్, మొయినాబాద్ వంటి ప్రాంతాల వారు సరిపడ బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు స్పందించి బస్సుల సంఖ్య పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.

News November 17, 2025

HYD: బస్సుల సంఖ్య పెంచాలని డిమాండ్

image

నగరంలో పెరుగుతున్న కాలనీలు, జనాభా, మహాలక్ష్మి ఉచిత బస్సు పథకంతో ప్రయాణికుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దీంతో పలు ప్రాంతాల్లో బస్సు సర్వీసులు పెంచాలంటూ డిమాండ్లు కూడా పెరుగుతున్నాయి. కుత్బుల్లాపూర్, ఘట్కేసర్, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, మేడ్చల్, మొయినాబాద్ వంటి ప్రాంతాల వారు సరిపడ బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు స్పందించి బస్సుల సంఖ్య పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.

News November 17, 2025

హైదరాబాద్ బస్తీలకు కదిలే అంగన్వాడీలు!

image

కదిలే గ్రంథాలయం, మూవింగ్ ఫుడ్ కోర్ట్ విన్నాం కానీ.. కదిలే అంగన్ వాడీ కేంద్రం విన్నారా..? లేదు కదా..! త్వరలో చూస్తారు కూడా. నగరంలోని పలు బస్తీలు, కాలనీల్లో మూవింగ్ అంగన్‌‌వాడీ కేంద్రాల ద్వారా సేవలందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు 37 అధునాతన వాహనాలను కూడా సిద్ధం చేసిందని సమాచారం. అంగన్‌వాడీ కేంద్రాలు అందుబాటులో లేని ప్రాంతాల్లో పౌష్టికాహారం అందించడంతో పాటు ఆరోగ్య సలహాలు ఇస్తారు.