News April 25, 2024
నామినేషన్ దాఖలు చేసిన వెంకట్రామిరెడ్డి

మెదక్ బీఅర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి బుధవారం మొదటి సెట్ నామినేషన్ ను దాఖలు చేశారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, బీఅర్ఎస్ నాయకుడు నగేష్ తో కలసి మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
Similar News
News December 11, 2025
మెదక్: ఎన్నికల సాధారణ పరిశీలకురాలు సందర్శన

మెదక్ జిల్లా మొదటి విడతలో పంచాయతీ ఎన్నికల సందర్బంగా పెద్ద శంకరంపేట, రేగోడు మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను ఎన్నికల సాధారణ పరిశీలకురాలు భారతి లక్పతి నాయక్ సందర్శించారు. ఎన్నికల సంఘం ఆదేశాలు, సూచనల మేరకు అధికారులు, సిబ్బంది పనిచేయాలని సూచించారు. మొదటి విడత మాదిరిగానే రాబోయే రెండు, మూడు విడతల్లో పారదర్శకంగా పనిచేయాలన్నారు.
News December 11, 2025
మెదక్: ‘ఉపాధ్యాయులకు ఓడి అవకాశం కల్పించాలి’

మెదక్ జిల్లా విద్యాధికారిని గురువారం ఉపాధ్యాయ సంఘం నాయకులు కలిశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉపాధ్యాయులందరికీ ఎన్నికలు జరిగిన మరుసటి రోజు ఓడి సదుపాయం కల్పించాలని మెదక్ జిల్లా విద్యాధికారి విజయకు ఉపాధ్యాయ సంఘాలు వినతి పత్రం సమర్పించారు. ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లో ఉన్నవారికి సమస్యలు పరిష్కారం కోసం వినతి పత్రం సమర్పించినట్టు తెలిపారు.
News December 11, 2025
మెదక్: 88.46% ఓటింగ్గా తేల్చిన అధికారులు

మెదక్ జిల్లాలో ఆరు పంచాయతీలలో జరిగిన ఎన్నికలలో 88.46 శాతం ఓట్లు పోలైనట్లు జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య తెలిపారు. 1,63,148 ఓటర్లు ఉండగా 1,44,323 ఓట్లు పోలైనట్లు వివరించారు. ఎన్నికలలో 89.68% పురుషులు, 87.34 శాతం మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 69,933 మంది పురుషులు, 74 వేల 388 మంది మహిళలు, ఇద్దరు ఇతరులు ఓటు హక్కు వినియోగించుకున్నట్లు పేర్కొన్నారు.


