News April 25, 2024
నామినేషన్ దాఖలు చేసిన వెంకట్రామిరెడ్డి
మెదక్ బీఅర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి బుధవారం మొదటి సెట్ నామినేషన్ ను దాఖలు చేశారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, బీఅర్ఎస్ నాయకుడు నగేష్ తో కలసి మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
Similar News
News January 18, 2025
కంగ్టి: 60 సంవత్సరాలు పూర్తయిన సభ్యులకు సన్మానం
కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం గ్రామ సమైక్య సమావేశం నిర్వహించారు. డ్వాక్రా గ్రూప్లో 60 సంవత్సరాలు పూర్తయిన మహిళ మాజీ వార్డు సభ్యురాలు కుమ్మరి సత్యవ్వను గ్రామ సమాఖ్య ఆధ్వర్యంలో సన్మానించారు. సీసీలు రేణుక, కల్లప్ప, వివోఏలు సుమ, సవిత, వివో లీడర్లు మహిళ సమైక్య సభ్యులు పాల్గొన్నారు.
News January 18, 2025
సంగారెడ్డి: గర్భం దాల్చిన బాలిక
మతిస్థిమితం లేని బాలిక గర్భం దాల్చిన ఘటన హత్నూర(M)లో అలస్యంగా వెలుగులోని వచ్చింది. స్థానికుల ప్రకారం.. ఓ గ్రామానికి చెందిన బాలిక 9వ తరగతి చదివి ఇంటి వద్దే ఉంటోంది. తల్లిదండ్రులు కూలీ పనుల కోసం వెళ్లగా ఒంటరిగా ఉన్న బాలికపై కొందరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆమె గర్భం దాల్చింది. 7 నెలల గర్భవతి కావడంతో విషయం తెలుసుకున్న జిల్లా వైద్యాధికారులు వైద్యం అందిస్తున్నారు. కేసు నమోదు కాలేదు.
News January 18, 2025
సిద్దిపేట: ఉద్యోగం సాధించిన యువతి
సిద్దిపేట జిల్లా చేర్యాలకి చెందిన తుమ్మలపల్లి కనకయ్య, కవితల కుమార్తె నవ్య ENCO AE ఫలితాలలో ఉద్యోగం సాధించారు. బీటెక్ JNTU మంథని ప్రభుత్వ కళాశాలలో పూర్తి చేశారు. ఆ తర్వాత HYDలో ఉంటూ ప్రిపేర్ అయ్యి ఉద్యోగం సాధించారు. దీంతో గ్రామస్థులు, కుటుంబ సభ్యులు ఆమెను అభినందించారు.