News March 28, 2025
నాయుడుపేటలో బాలికపై అత్యాచారయత్నం.. ఐదేళ్లు శిక్ష

మైనర్ బాలికపై అత్యాచారయత్నం కేసులో వెంకయ్య అనే వ్యక్తికి నాయుడుపేట కోర్టు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.22,000 జరిమానా విధించింది. నాయుడుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మైనర్ బాలిక ఆడుకుంటుండగా 2019లో వెంకయ్య అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు అదే రోజు వెంకయ్యను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పొక్సో కోర్టు న్యాయమూర్తి సుమ నేరం రుజువు కావడంతో గురువారం శిక్ష ఖరారు చేశారు.
Similar News
News October 28, 2025
Way2News ‘తుఫాను’ అప్డేట్స్

AP: మొంథా తుఫాను ప్రభావంతో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భీకర గాలులకు పలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ఈ రాత్రి తుఫాను తీరం దాటనున్న నేపథ్యంలో తాజా వాతావరణ సమాచారం, అధికారుల సూచనలు, సహాయక చర్యల వివరాలు తెలుసుకోవడానికి ‘Way2News’ను ఫాలో అవ్వండి. కచ్చితమైన, తాజా అప్డేట్లను అందిస్తూ మిమ్మల్ని సురక్షితంగా ఉంచడంలో వే2న్యూస్ తోడుగా ఉంటుంది.
News October 28, 2025
నంద్యాల: ‘అవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దు’

నంద్యాల జిల్లాకు మొంథా తుఫాన్ ప్రభావం వలన ఆరెంజ్ అలర్ట్ ఇచ్చిన నేపథ్యంలో జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్న సందర్భంగా పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలను ప్రమాదాలబారీన పడకుండా అప్రమత్తం చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా SP సునీల్ షెరాన్ తెలిపారు. రహదారుల్లో ప్రయాణించే భారీ వాహనాలను రాత్రి 7 గంటల నుంచి సురక్షితమైన ప్రాంతాల్లో నిలుపుకోవాలన్నారు. ఎవరైనా ప్రమాదంలో ఉంటే 112కు ఫోన్ చేయాలన్నారు.
News October 28, 2025
అన్నమయ్య జిల్లాలోని స్కూళ్లకు సెలవు లేదు: డీఈవో

అన్నమయ్య జిల్లాలో స్కూళ్లకు బుధవారం సెలవు లేదని జిల్లా విద్యాశాఖాధికారి Dr. K. సుబ్రమణ్యం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం నుంచి పాఠశాలలు యథావిధిగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు అన్ని మండల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అన్ని ప్రైవేట్ పాఠశాలలు రేపు స్కూళ్లను కొనసాగించాలని, అంగన్వాడీ సెంటర్లు కూడా తెరవాలని ఆదేశించారు.


