News January 24, 2025
నాయుడుపేట: బాలుడి మిస్సింగ్
తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని అంబేడ్కర్ బాలుర గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న నందముని అనే బాలుడు మిస్ అయ్యాడు. సూళ్లూరుపేట మండల పరిధిలోని మన్నెమూర్తి గ్రామానికి చెందిన నందముని నాయుడుపేటలో చదువుతున్నాడు. సంక్రాంతి సెలవుల తర్వాత తల్లిదండ్రులు పాఠశాలలో వదిలారు. గురువారం నుంచి విద్యార్థి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులు ఫిర్యాదు చేశారు.
Similar News
News February 6, 2025
‘RC16’ సెట్లో క్లీంకారా సందడి
రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్లో ‘RC16’ అనే వర్కింగ్ టైటిల్తో ఓ మూవీ తెరకెక్కుతోంది. హైదరాబాద్ శివార్లలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సెట్లో చరణ్ కుమార్తె క్లీంకార సందడి చేశారు. చెర్రీ ఆమెను ఎత్తుకుని ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. శివరాజ్ కుమార్, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. AR రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
News February 6, 2025
47లక్షల రైతుల పరిస్థితి ఏంటి?: హరీశ్రావు
తెలంగాణలో 68 లక్షల మంది రైతులుంటే ప్రభుత్వం 21.45 లక్షల మందికి రైతుభరోసా వేసిందని… మిగతా 47 లక్షల అన్నదాతల పరిస్థితి ఏంటని హరీశ్ రావు ప్రశ్నించారు. రైతుభరోసా మెుత్తం తొలుత రూ.7500 అని చెప్పి దానిని రూ.6వేలకే కుదించారన్నారు. ఎకరం లోపు భూమి ఉన్నవారి సంఖ్య గతంతో పోలిస్తే తగ్గిందన్నారు. కాంగ్రెస్ గోరంత చేసి కొండంతగా చెప్పుకుంటుందని తన X ఖాతాలో పోస్ట్ చేశారు.
News February 6, 2025
ఏలూరులో ఒక్కే ఒక్క నామినేషన్
తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈక్రమంలో బుధవారం భీమడోలుకు చెందిన బాలాజీ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. ఏలూరు కలెక్టరేట్లో ఎమ్మెల్సీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కె.వెట్రిసెల్వికి ఓ సెట్ నామినేషన్ పత్రాలను సమర్పించారు. అభ్యర్ధి బాలాజీతో రిటర్నింగ్ అధికారి ప్రమాణం చేయించారు.