News February 4, 2025
నారాయణఖేడ్: ఇరు వర్గాల ఘర్షణ.. 10 మందికి గాయాలు

నారాయణఖేడ్ మండలం బానాపూర్లో జరిగిన ఘర్షణలో 10 మంది గాయపడ్డారు. స్థానికుల సమాచారం.. బాణాపురం గ్రామస్థులు, పక్కనే ఉన్న బుడగ జంగాల కాలనీకి చెందిన కొందరు 4 రోజుల క్రితం జరిగిన గొడవలను దృష్టిలో పెట్టుకొని రాళ్లు, కర్రలతో పరస్పర దాడులకు పాల్పడ్డారు. దాడుల్లో ఇరు వర్గాలకు చెందిన 10 మంది గాయపడ్డారు. పోలీసులు ఘటనాకి చేరుకొని పరిస్థితి అదుపులోకి తీసుకువచ్చి, ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశారు.
Similar News
News February 18, 2026
పదో తరగతి ఉత్తీర్ణత సాధించేలా చర్యలు: కలెక్టర్

భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి పదో తరగతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించేలా కట్టుదిట్టమైన కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అధికారులను ఆదేశించారు. పదో తరగతి ఉత్తీర్ణత శాతం పెంపు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పెంపు, పాఠశాలల్లో తాగునీటి, మరుగుదొడ్ల సౌకర్యాల మెరుగుదల తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో జూమ్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.
News February 18, 2026
విశాఖ: ‘సముద్ర సంప్రదాయాల పట్ల ఐక్యతకు నిదర్శనం ఫ్లీట్ రివ్యూ’

అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీక్షించారు. ఈ కార్యక్రమం సముద్ర సంప్రదాయాల పట్ల దేశాల మధ్య ఉన్న ఐక్యత, గౌరవానికి చిహ్నమని ఆమె పేర్కొన్నారు. ప్రపంచ దేశాల నౌకాదళాల సమిష్టి కృషి వల్ల సముద్ర మార్గాలు ప్రపంచాభివృద్ధికి, శ్రేయస్సుకు, మానవాళి సంక్షేమానికి కీలకమైన ద్వారాలుగా మారుతాయని రాష్ట్రపతి ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.
News February 18, 2026
వేములవాడ: మహిళ అనుమానాస్పద మృతి..!

వేములవాడ పట్టణంలోని కోరుట్ల బస్టాండ్ ప్రాంతానికి చెందిన వెంగళ రోహిణి (32) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కథలాపూర్ మండలానికి చెందిన రోహిణికి వెంగళ దినేష్తో 8 సంవత్సరాల క్రితం వివాహం కాగా ఇద్దరు సంతానం ఉన్నారు. బుధవారం తెల్లవారుజామున ఉరివేసుకుందని, ఆసుపత్రికి తీసుకువెళ్లేలోగా రోహిణి మరణించిందని స్థానికులు తెలిపారు.


