News January 27, 2025
నారాయణపేటలో క్వింటా వేరుశనగ ధర ఎంతంటే?

నారాయణపేట వ్యవసాయ మార్కెట్కు సోమవారం భారీగా వేరుశనగకాయ తరలి వచ్చింది.1551 క్వింటాళ్ల వేరుశనగ రాగా.. గరిష్ఠంగా రూ.5,775.. కనిష్ఠంగా రూ.3,020 ధర పలికింది. సోనారకం వరి ధాన్యం 9 క్వింటాళ్లు రాగా.. గరిష్ఠంగా రూ.1,939.. కనిష్ఠంగా రూ.1,939 ధర పలికింది. 50,69 క్వింటాళ్ల ఎర్ర రకం కందులు రాగా.. గరిష్ఠంగా రూ.7,549 కనిష్ఠంగా రూ.3,200 వరకు పలికినట్లు వ్యవసాయ మార్కెట్ అధికారి లక్ష్మణ్ తెలిపారు.
Similar News
News December 10, 2025
అలా చేస్తే కేసులు నమోదు చేస్తాం: తిరుపతి SP

తిరుమల వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు ఇప్పిస్తామని జీప్ డ్రైవర్లు, దళారులు భక్తులను మోసగిస్తే కేసులు నమోదు చేస్తామని తిరుపతి SP సుబ్బరాయుడు హెచ్చరించారు. వైకుంఠ ఏకాదశి దర్శన ఏర్పాట్లపై TTD అధికారులతో ఆయన సమీక్ష చేశారు. బస్టాండ్, రైల్వే స్టేషన్, శ్రీనివాసం, అలిపిరి, లగేజ్ కౌంటర్ వంటి ముఖ్య ప్రదేశాల్లో భక్తులకు నిరంతర అవగాహన కల్పించాలని సూచించారు. రెగ్యులర్గా బాంబ్ స్క్వాడ్ తనిఖీలు ఉంటాయన్నారు.
News December 10, 2025
మొదలైన లారీల బంద్

TGలో లారీల టెస్టింగ్, ఫిట్నెస్ ఛార్జీలు తగ్గించాలని సౌత్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి బంద్ పాటిస్తున్నామని తెలిపింది. 13ఏళ్లు దాటిన వాహనాలకు ఫిట్నెస్, టెస్టింగ్ కోసం రూ.12 వేలు వసూలు చేసేవారని, తాజాగా రూ.30వేలకు పెంచారని మండిపడ్డారు. అటు APలో లారీ ఓనర్ అసోసియేషన్తో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం కావడంతో అక్కడ బంద్ తాత్కాలికంగా వాయిదా పడింది.
News December 10, 2025
పరిటాల సునీతపై ప్రకాశ్ రెడ్డి ఆగ్రహం

ప్రజలను ఉద్దరిస్తారని గెలిపిస్తే, దోపిడీ చేసుకునేందుకు లైసెన్స్ ఇచ్చినట్లు ఫీలవుతున్నారా? అని MLA పరిటాల సునీతను తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు. ‘భర్త నాలుగు, నువ్వు మూడుసార్లు ఎమ్మెల్యే అయినా పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకురాలేదు. మీ దాష్టీకాలను ప్రజలు గమనిస్తున్నారు. క్షమాపణ చెప్పి రాజకీయాల నుంచి వైదొలగండి’ అని డిమాండ్ చేశారు. రామగిరి MPP ఎన్నికను బాయ్కాట్ చేస్తున్నామని ప్రకటించారు.


