News January 27, 2025

నారాయణపేటలో క్వింటా వేరుశనగ ధర ఎంతంటే?

image

నారాయణపేట వ్యవసాయ మార్కెట్‌కు సోమవారం భారీగా వేరుశనగకాయ తరలి వచ్చింది.1551 క్వింటాళ్ల వేరుశనగ రాగా.. గరిష్ఠంగా రూ.5,775.. కనిష్ఠంగా రూ.3,020 ధర పలికింది. సోనారకం వరి ధాన్యం 9 క్వింటాళ్లు రాగా.. గరిష్ఠంగా రూ.1,939.. కనిష్ఠంగా రూ.1,939 ధర పలికింది. 50,69 క్వింటాళ్ల ఎర్ర రకం కందులు రాగా.. గరిష్ఠంగా రూ.7,549 కనిష్ఠంగా రూ.3,200 వరకు పలికినట్లు వ్యవసాయ మార్కెట్ అధికారి లక్ష్మణ్ తెలిపారు.

Similar News

News February 14, 2025

గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణానికి సహకరించాలి: కలెక్టర్

image

వరంగల్ జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణానికి రైతులు తమ భూములు అందించి సహకరించాలని కలెక్టర్ సత్య శారదా దేవి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో గ్రీన్ ఫిల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి భూ సేకరణ కోసం సంగెం గ్రామానికి చెందిన రైతులతో చర్చించారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దేశాభివృద్ధికి రహదారులు చాలా అవసరమని తద్వారా జిల్లా అభివృద్ధి చెందుతుందన్నారు.

News February 14, 2025

GBS బాధితులకు ఉచిత వైద్యం: మంత్రి సత్యకుమార్

image

APలో 17 గిలియన్ బార్ సిండ్రోమ్(GBS) వైరస్ కేసులు <<15225307>>వెలుగు చూశాయని<<>> వైద్యశాఖ వెల్లడించింది. గుంటూరు, విశాఖలో ఐదు చొప్పున, కాకినాడలో 4, విజయవాడ, అనంతపురం, విజయనగరంలో ఒక్కో కేసు బయటపడ్డాయని పేర్కొంది. బాధితులకు ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచిత చికిత్స అందిస్తున్నామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. 8వేల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందొద్దని ధైర్యం చెప్పారు.

News February 14, 2025

సహకార సంఘాల కాలపరిమితి పెంపు

image

తెలంగాణలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గ గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. 904 సహకార సంఘాల కాలపరిమితి, 9 DCCB ఛైర్మన్ల పదవీకాలన్ని మరో 6 నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రేపటితో గడువు ముగుస్తున్నా ఎన్నికల ప్రక్రియకు సంబంధించి రాష్ట్ర సహకార సంఘాల రిజిస్ట్రార్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో పాలకవర్గాల గడువును ప్రభుత్వం పొడిగించింది.

error: Content is protected !!