News March 15, 2025

నారాయణపేట్: నేటి నుంచే ఒంటిపూట బడులు..!

image

ఎండల తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం విద్యార్థులకు నేటి నుంచి ఒంటిపూట బడులను నిర్వహించాలని నిర్ణయించింది. ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు తరగతులు జరగనున్నాయి. ఎగ్జామ్ సెంటర్ పడ్డ స్కూల్స్‌లో మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5గంటల వరకు తరగతులు జరుగుతాయి. ఏప్రిల్23 వరకు ఈ హాఫ్‌డే స్కూల్స్ ఉంటాయి. ఏప్రిల్24 నుంచి జూన్11 వరకు వేసవి సెలవులు. జూన్12న పాఠశాలలు రీ-ఓపెన్.

Similar News

News November 29, 2025

కామారెడ్డి: రాష్ట్ర స్థాయికి నామినేట్ అయిన 8 పాఠశాలలు

image

జిల్లా స్థాయిలో SHVR 2025-26 బెస్ట్ రేటింగ్‌లో భాగంగా జిల్లా వ్యాప్తంగా 8 పాఠశాలలు ఎంపికైనట్లు డీఈవో రాజు తెలిపారు. రూరల్‌లో TSNR ZPHS బీబీపేట్, ZPHS బోర్లం, ZPHS ధర్మారావుపేట్, PS మహమ్మదాపూర్, PS శక్తి నగర్, UPS ఇస్సన్నపల్లి, అర్బన్‌లో సరస్వతీ శిశుమందిర్ కామారెడ్డి, PS INC కామారెడ్డి స్కూల్స్ జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి నామినేట్ అయినట్లు DEO పేర్కొన్నారు.

News November 29, 2025

GDP వృద్ధి.. దేశ పౌరులందరికీ ఉత్సాహాన్ని ఇచ్చే వార్త: CBN

image

2025-26 రెండో త్రైమాసికంలో దేశ GDP 8.2% వృద్ధి చెందడం ప్రతి పౌరుడికి ఉత్సాహాన్నిచ్చే వార్త అని CM CBN అన్నారు. ఈ వేగం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా దేశాన్ని నిలిపిందని హర్షం వ్యక్తం చేశారు. మోదీ నాయకత్వంలో దేశం వికసిత్ భారత్ లక్ష్యాల వైపు స్థిరంగా కొనసాగుతోందన్నారు. తాజా వృద్ధి తయారీ, నిర్మాణం, ఆర్థిక సేవలు తదితర రంగాలకు ప్రోత్సాహాన్ని ఇస్తుందని పేర్కొన్నారు.

News November 29, 2025

కామారెడ్డి: నిర్లక్ష్య డ్రైవింగ్ చేసిన వ్యక్తికి 3 నెలల జైలు శిక్ష

image

నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ఓ వ్యక్తి మృతికి కారణమైన నిందితుడు మహమ్మద్ షమీంకు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి వినీల్ కుమార్ 3 నెలల జైలు శిక్ష విధించారు. 2017లో కండేబల్లూర్‌కు చెందిన కుమ్మరి కుంట నాగయ్య మృతి చెందాడు. అతని కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సరైన సాక్ష్యాధారాలతో నిందితుడిని కోర్టు ఎదుట హాజరు పరిచారు.