News March 15, 2025
నారాయణపేట్: నేటి నుంచే ఒంటిపూట బడులు..!

ఎండల తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం విద్యార్థులకు నేటి నుంచి ఒంటిపూట బడులను నిర్వహించాలని నిర్ణయించింది. ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు తరగతులు జరగనున్నాయి. ఎగ్జామ్ సెంటర్ పడ్డ స్కూల్స్లో మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5గంటల వరకు తరగతులు జరుగుతాయి. ఏప్రిల్23 వరకు ఈ హాఫ్డే స్కూల్స్ ఉంటాయి. ఏప్రిల్24 నుంచి జూన్11 వరకు వేసవి సెలవులు. జూన్12న పాఠశాలలు రీ-ఓపెన్.
Similar News
News November 7, 2025
అక్టోబర్లో రూ.119.35 కోట్లు ఆదాయం

తిరుమల శ్రీవారి హుండీ ద్వారా అక్టోబర్ నెలలో రూ.119.35 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ ప్రకటించింది. స్వామివారిని 22.77 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. 1.23 కోట్ల లడ్డూలు విక్రయం జరిగింది. 34.20 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. తలనీలాలు 8.31 లక్షల మంది స్వామి వారికి సమర్పించారు.
News November 7, 2025
సిరిసిల్ల: రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక

సిరిసిల్లలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థిని సుధగోని లహరి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరగనున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైందని ప్రధానోపాధ్యాయులు శారదా తెలిపారు. ఈ పోటీలు ఖమ్మం జిల్లా పినపాక మండలం బయ్యారంలో ఈనెల 8 నుంచి 10 వరకు జరుగుతాయన్నారు. రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన లహరిని ప్రధానోపాధ్యాయురాలు శారద, PET టీచర్ సురేష్, ఉపాధ్యాయులు అభినందించారు.
News November 7, 2025
కృష్ణా నదిలో దూకి మహిళ ఆత్మహత్య

కృష్ణా నదిలో దూకి మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన పెనుమూడిలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. రేపల్లెలోని 5వ వార్డుకు చెందిన గరికపాటి రమాదేవి (29) పెనుమూడి-పులిగడ్డ వారధిపై నుంచి నదిలోకి దూకింది. మత్స్యకారులు ఆమెను ఒడ్డుకు చేర్చి రేపల్లె ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. మహిళను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


