News March 15, 2025

నారాయణపేట్: నేటి నుంచే ఒంటిపూట బడులు..!

image

ఎండల తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం విద్యార్థులకు నేటి నుంచి ఒంటిపూట బడులను నిర్వహించాలని నిర్ణయించింది. ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు తరగతులు జరగనున్నాయి. ఎగ్జామ్ సెంటర్ పడ్డ స్కూల్స్‌లో మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5గంటల వరకు తరగతులు జరుగుతాయి. ఏప్రిల్23 వరకు ఈ హాఫ్‌డే స్కూల్స్ ఉంటాయి. ఏప్రిల్24 నుంచి జూన్11 వరకు వేసవి సెలవులు. జూన్12న పాఠశాలలు రీ-ఓపెన్.

Similar News

News December 4, 2025

సంగారెడ్డి: భారీగా రేషన్ బియ్యం పట్టివేత

image

మెదక్ జిల్లా తూప్రాన్‌లో అక్రమంగా తరలిస్తున్న 285.70 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నట్లు విజిలెన్స్ డీఎస్పీ రమేష్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా పాశమైలారం నుంచి మహారాష్ట్రకు సన్న రేషన్ బియ్యము తరలిస్తున్నారు. నమ్మదగిన సమాచారం రావడంతో తూప్రాన్ పరిధి లోని అల్లాపూర్ టోల్ ప్లాజా వద్ద గురువారం వాహన తనిఖీ చేపట్టగా రేషన్ బియ్యం లారీ పట్టుబడినట్లు తెలిపారు. విజిలెన్స్ సీఐ అజయ్ బాబు పాల్గొన్నారు.

News December 4, 2025

తెలంగాణలో అఖండ-2 టికెట్ రేట్ల పెంపు

image

‘అఖండ-2’ సినిమా టికెట్ రేట్ల <<18450771>>పెంపునకు<<>> TG ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవాళ రా.8 గంటల నుంచి ప్రీమియర్స్ మొదలవనున్నట్లు పేర్కొంది. ప్రీమియర్ షో టికెట్ రేట్‌ను రూ.600గా నిర్ధారించింది. తర్వాతి 3 రోజులు సింగిల్ స్క్రీన్‌కు రూ.50, మల్టీప్లెక్స్‌లకు రూ.100 చొప్పున పెంచుకోవచ్చని తెలిపింది. టికెట్ రేట్ల పెంపుతో వచ్చే రెవెన్యూలో 20% మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు ఇవ్వాలని GOలో పేర్కొంది.

News December 4, 2025

MHBD: వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి: SP

image

తెల్లవారుజామున చలి తీవ్రత, మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుందని, ఈ సమయంలో వాహనాలు నడిపేవారు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ శబరిష్ సూచించారు. ప్రమాదాల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలన్నారు. కొన్నిసార్లు పొగ మంచు ఎక్కువగా ఉంటే వాహనాలు ఆపాలన్నారు. నిర్దిష్ట స్పీడ్‌తో వాహనాలను నడపడం వల్ల స్లిప్పరీ రోడ్ల నుంచి వాహనాలు స్కిడ్ కాకుండా నివారించవచ్చన్నారు.