News February 21, 2025

నారాయణపేట: ఈ ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనం: సీఎం

image

మారుమూల ప్రాంతంలో ఒక మెడికల్ కళాశాల, నర్సింగ్ కాలేజ్‌ను ప్రారంభించుకోవడం ఆనందదాయకమని CM రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లాలో ఆయన పర్యటనలో భాగంగా మెడికల్ కళాశాల విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం జరిగింది. ఆయన మాట్లాడుతూ.. గతంలో కేంద్రం తిరస్కరించినా తమ మంత్రి, అధికారులు తీవ్రంగా ప్రయత్నించి ఎనిమిది మెడికల్ కాలేజీలకు అనుమతి తీసుకొచ్చారని అన్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు.

Similar News

News November 23, 2025

11 కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం

image

AP: 11 కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌కు కళ్యాణం శివశ్రీనివాసరావు, స్టేట్ అడ్వైజరీ బోర్డ్ ఆన్ ఛైల్డ్ లేబర్‌కు సత్యనారాయణ రాజు, ఉర్దూ అకాడమీకి మౌలానా షిబిలీ, అఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్‌కు విక్రమ్, ఫిషర్‌మెన్ కో-ఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్‌కు రామ్‌ప్రసాద్, స్టేట్ షేక్ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ సొసైటీకి ముక్తియార్‌ను నియమించింది.

News November 23, 2025

GHMC: సీసీ రోడ్ల పెండింగ్.. ఈ 3 జోన్లలో అధికం

image

​ఖైరతాబాద్ జోన్‌లో మొత్తం 506 పనులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటి విలువ రూ.14,042.7 లక్షలు. 27 BT రోడ్ల పనుల్లో కేవలం 4 మాత్రమే పూర్తయ్యాయి!​చార్మినార్ జోన్‌లో 728 పనులు పెండింగ్‌లో ఉన్నాయి. విలువ రూ.13,556.93 లక్షలు. ఇక్కడ కూడా CC పనుల బకాయి రూ.12,778.78 లక్షలుగా ఉంది.​ LBనగర్ జోన్‌లో రూ.11,446.4 లక్షల విలువైన 175 పనులు మిగిలి ఉన్నాయి.​ <<18363545>>ఈ మూడు జోన్లలో<<>>ని రోడ్ల సమస్యలపై ప్రజాగ్రహం తప్పేలా లేదు.

News November 23, 2025

SRCL: డ్రగ్స్‌కు దూరంగా ఉందాం: డబ్ల్యూఓ లక్ష్మీరాజం

image

బాల్యవివాహాలను అరికట్టాలని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం అన్నారు. శనివారం సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన ‘నశా ముక్త్ భారత్ అభియాన్’ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. డ్రగ్స్ వల్ల మెదడు మొద్దుబారడం, కండరాలు పనిచేయకుండా పోవడం వంటి దుష్ప్రభావాలు కలుగుతాయని విద్యార్థులకు వివరించారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా సన్మార్గంలో నడవాలని అన్నారు.