News February 21, 2025
నారాయణపేట: ఈ ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనం: సీఎం

మారుమూల ప్రాంతంలో ఒక మెడికల్ కళాశాల, నర్సింగ్ కాలేజ్ను ప్రారంభించుకోవడం ఆనందదాయకమని CM రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లాలో ఆయన పర్యటనలో భాగంగా మెడికల్ కళాశాల విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం జరిగింది. ఆయన మాట్లాడుతూ.. గతంలో కేంద్రం తిరస్కరించినా తమ మంత్రి, అధికారులు తీవ్రంగా ప్రయత్నించి ఎనిమిది మెడికల్ కాలేజీలకు అనుమతి తీసుకొచ్చారని అన్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు.
Similar News
News November 18, 2025
ఆదిలాబాద్: నేటి నుంచి KU డిగ్రీ పరీక్షలు ప్రారంభం

కాకతీయ యూనివర్సిటీ (KU) పరిధిలో 1, 3, 5 సెమిస్టర్ల డిగ్రీ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. 5వ సెమిస్టర్ పరీక్షలు ఈరోజు నుంచి 1వ సెమిస్టర్ పరీక్షలు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరగనున్నాయి. 3వ సెమిస్టర్ పరీక్షలు ఈనెల 19 నుంచి ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పరీక్షల విభాగం అధికారులు తెలిపారు.
News November 18, 2025
ఆదిలాబాద్: నేటి నుంచి KU డిగ్రీ పరీక్షలు ప్రారంభం

కాకతీయ యూనివర్సిటీ (KU) పరిధిలో 1, 3, 5 సెమిస్టర్ల డిగ్రీ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. 5వ సెమిస్టర్ పరీక్షలు ఈరోజు నుంచి 1వ సెమిస్టర్ పరీక్షలు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరగనున్నాయి. 3వ సెమిస్టర్ పరీక్షలు ఈనెల 19 నుంచి ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పరీక్షల విభాగం అధికారులు తెలిపారు.
News November 18, 2025
POK ప్రధానిగా రజా ఫైసల్

పాక్ ఆక్రమిత కశ్మీర్ నూతన ప్రధానిగా PPP నేత రజా ఫైసల్ ముంతాజ్ ఎన్నికయ్యారు. ఇమ్రాన్ ఖాన్ PTI పార్టీకి చెందిన అన్వరుల్ హక్పై ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి ఆమోదం లభించడంతో కొత్త ప్రధాని కోసం ఓటింగ్ నిర్వహించారు. 52 సభ్యులకు గాను ముంతాజ్కు 32 మంది అనుకూలంగా ఓటేశారు. కాగా POKకు స్వయంప్రతిపత్తిని కల్పించినట్లు చెప్పుకునే పాక్ అక్కడ నామమాత్రపు PM, ప్రెసిడెంట్ పదవులను ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే.


