News April 14, 2025
నారాయణపేట: ఎకరానికి రూ.40 వేలు నష్టపరిహారం అందించాలి: శ్రీనివాస్ గౌడ్

నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం గోర్లోనిబావి గ్రామంలో లో వోల్టేజ్ కరెంటుతో ఎండిపోయిన వరి పొలాలను మహబూబ్నగర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్యెల్యే పట్నం నరేందర్ రెడ్డితో కలిసి పరిశీలించారు. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. పంట నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. తక్షణమే ఎకరానికి రూ.40 వేలు నష్టపరిహారంగా అందించాలని డిమాండ్ చేశారు.
Similar News
News December 15, 2025
రాజమండ్రి: రేపటి నుంచి ఉర్దూ స్వర్ణోత్సవ వారోత్సవాలు

ఉర్దూ అకాడమీ స్థాపించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈనెల 16 నుంచి 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా స్వర్ణోత్సవ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు డీఆర్ఓ టి.సీతారామమూర్తి తెలిపారు. సోమవారం రాజమండ్రి కలెక్టరేట్లో ఉర్దూ అకాడమీ ప్రతినిధి నస్రీన్ ఫాతిమాతో కలిసి కార్యక్రమ వివరాలు వెల్లడించారు. మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపడుతున్నామని, అందరూ వీటిని విజయవంతం చేయాలని కోరారు.
News December 15, 2025
వంగూరు: కొత్త విద్యుత్ మోటార్ ఏర్పాటు చేసిన సర్పంచ్

వంగూరు మండలం గాజర సర్పంచ్ పులిగిల్ల శ్రీపతిరావు సోమవారం ఈదమ్మ గుడి వద్ద నూతన విద్యుత్ మోటర్ ఏర్పాటు చేసి ప్రారంభించారు. సర్పంచ్ పి.శ్రీపతిరావు మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు సర్పంచ్గా గెలిచిన అనంతరం మోటర్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో వార్డు మెంబర్లు చింతకుంట్ల సైదులు, కటికర్ల ఆంజనేయులు, ఉప సర్పంచ్ సునీత కొండల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
News December 15, 2025
మెదక్: నాడు గెలిచి.. నేడు ఓడిన దంపతులు

మెదక్ మండలం మాచవరం గ్రామపంచాయతీ ఎన్నికపై అందరి దృష్టి ఆకర్షించే విషయం తెలిసిందే. ఇక్కడ గత ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యులుగా విజయం సాధించిన దంపతులు ఈసారి ఓటమిపాలయ్యారు. గత ఎన్నికల్లో సర్పంచిగా సంధ్యారాణి, వార్డు సభ్యులుగా శ్రీనివాస్ చౌదరి గెలుపొందారు. ఈసారి సర్పంచ్ పదవికి శ్రీనివాస్ చౌదరి, వార్డు సభ్యులు పదవికి సంధ్యా రాణి పోటీ చేసి ఓటమి చవి చూశారు. ఇక్కడ సాంబశివరావు గెలుపొందారు.


