News April 14, 2025
నారాయణపేట: ఎకరానికి రూ.40 వేలు నష్టపరిహారం అందించాలి: శ్రీనివాస్ గౌడ్

నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం గోర్లోనిబావి గ్రామంలో లో వోల్టేజ్ కరెంటుతో ఎండిపోయిన వరి పొలాలను మహబూబ్నగర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్యెల్యే పట్నం నరేందర్ రెడ్డితో కలిసి పరిశీలించారు. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. పంట నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. తక్షణమే ఎకరానికి రూ.40 వేలు నష్టపరిహారంగా అందించాలని డిమాండ్ చేశారు.
Similar News
News October 15, 2025
పెళ్లి కన్నా డేటింగే బాగుంది: ఫ్లోరా సైనీ

తాను పెళ్లి చేసుకోవద్దని డిసైడ్ అయినట్లు నటి, బిగ్ బాస్-9 కంటెస్టెంట్ ఫ్లోరా సైనీ(ఆశా సైనీ) ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రస్తుతం బాయ్ ఫ్రెండ్తో డీప్ డేటింగ్లో ఉన్నట్లు చెప్పారు. పెళ్లి చేసుకొని విడిపోవడం కన్నా డేటింగ్ చేస్తూ లైఫ్ను ఎంజాయ్ చేయడమే బెటర్ అనిపిస్తోందన్నారు. అందుకే పెళ్లి వద్దని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. ఫ్లోరా తెలుగులో నువ్వు నాకు నచ్చావ్ తదితర చిత్రాల్లో నటించారు.
News October 15, 2025
డ్రైవింగ్ లైసెన్స్ మేళాకు యువతకు ఆహ్వానం: ADB SP

జిల్లా పోలీసు యంత్రాంగం తరఫున మొదటి విడత 5 మండలాలలో మెగా డ్రైవింగ్ లైసెన్స్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ బుధవారం తెలిపారు. ఈ నెల 18 వరకు వివరాలను పోలీస్ స్టేషన్లో నమోదు చేసుకోవాలన్నారు. ఆన్లైన్ లేదా మీసేవ సెంటర్లలో రుసుములు చెల్లించాలని కోరారు. నార్నూర్, గాదిగూడ, బజార్హత్నూర్, సిరికొండ, భీంపూర్ మండలాల యువతకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
News October 15, 2025
పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి: సీపీ

రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆధ్వర్యంలో బుధవారం నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. కేసుల దర్యాప్తులో వేగం, పెండింగ్ కేసులు త్వరితగతిన పరిష్కారం, మహిళల భద్రత, ప్రాపర్టీ నేరాలు, రోడ్డు ప్రమాదాలు, సైబర్ క్రైమ్స్ నియంత్రణపై అధికారులు దృష్టి సారించాలని సీపీ సూచించారు. గంజాయి, చట్ట వ్యతిరేక చర్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని, విధుల్లో అలసత్వం చూపితే శాఖా పరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.