News March 21, 2025
నారాయణపేట: కట్టుకున్నోడే కడ తేర్చాడు..!

నారాయణపేటలో కట్టుకున్న <<15830492>>భార్యను గొంతు నులిమి<<>> భర్త హత్య చేసిన విషయం తెలిసిందే. ఇన్ఛార్జ్ సీఐ రాజేందర్ రెడ్డి తెలిపిన వివరాలు.. నారాయణపేట మండలం డ్రైవర్ గోపి తండాకు చెందిన శారుభాయి(20), వినోద్ నాయక్ భార్యాభర్తలు. భార్య తనకు ఇష్టం లేదని నిత్యం వినోద్ గొడవ పడేవాడు. ఇష్టం లేని పెళ్లి చేశారంటూ వేధించేవాడు. ఈ క్రమంలో హత్య చేశాడు. 20 ఏళ్లకే శారుభాయి జీవితం ముగిసిందంటూ కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి.
Similar News
News November 18, 2025
భీమవరం: ‘సీబీ-సీఐడీ’ పేరుతో మోసం

భీమవరం పట్టణానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి శర్మ సైబర్ మోసగాళ్ల వలలో చిక్కుకొని రూ.78 లక్షలు పోగొట్టుకున్నారు. గత నెల 27న సీబీ-సీఐడీ అధికారులమంటూ ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు, సిమ్ సమస్యను పరిష్కరించడానికి ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు అడిగారని ఆయన తెలిపారు. వారి మాటలు నమ్మి వివరాలు చెప్పడంతో, తన ఖాతా నుంచి దఫదఫాలుగా రూ.78 లక్షలను మాయం చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 18, 2025
భీమవరం: ‘సీబీ-సీఐడీ’ పేరుతో మోసం

భీమవరం పట్టణానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి శర్మ సైబర్ మోసగాళ్ల వలలో చిక్కుకొని రూ.78 లక్షలు పోగొట్టుకున్నారు. గత నెల 27న సీబీ-సీఐడీ అధికారులమంటూ ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు, సిమ్ సమస్యను పరిష్కరించడానికి ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు అడిగారని ఆయన తెలిపారు. వారి మాటలు నమ్మి వివరాలు చెప్పడంతో, తన ఖాతా నుంచి దఫదఫాలుగా రూ.78 లక్షలను మాయం చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 18, 2025
ఎన్టీఆర్ జిల్లాలో 1,600 MSME యూనిట్ల లక్ష్యం

ఎన్టీఆర్ జిల్లాలో ఈ ఏడాది రూ.260 కోట్లతో 1,600 ఎంఎస్ఎంఈ యూనిట్లు స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని జిల్లా పరిశ్రమల CGM ఎం. మధు తెలిపారు. వీటి ద్వారా 8,500 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఇప్పటికే 997 యూనిట్లతో 5,045 మందికి ఉపాధి కల్పించామని, మిగిలిన లక్ష్యాన్ని ఆర్థిక సంవత్సరం చివరిలోపు చేరుకుంటామని స్పష్టం చేశారు.


