News February 21, 2025

నారాయణపేట: కొత్త మండలాల ఊసెత్తని సీఎం

image

కోటకొండ, గార్లపాడ్, కానుకుర్తి మండలాల ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో 3 గ్రామాల ప్రజలు నిరాశ చెందుతున్నారు. ఇటీవల ధర్నా నిర్వహించిన కోటకొండ గ్రామస్థులకు స్థానిక ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటనలో సీఎం నోటి వెంట మండల ప్రకటన చేయిస్తానని స్పష్టమైన హామీనిచ్చారు. దీంతో నేడు సీఎం మండల ప్రకటనపై కొండంత ఆశతో ఎదురుచూసినా నిరాశే మిగిలింది.

Similar News

News September 19, 2025

జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై నేడు కేటీఆర్ సమావేశం

image

నేడు BRS నేతలతో కేటీఆర్ సమావేశం కానున్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై చర్చించనున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, జూబ్లీహిల్స్‌లోని ముఖ్య నేతలతో ఇవాళ సమావేశం కానున్నారు. అభ్యర్థితో పాటు గ్రౌండ్ లెవెల్‌లో పనిచేసి విజయం సాధించడానికి చేయాల్సి కార్యచరణపై ఇవాళ చర్చించనున్నారు.

News September 19, 2025

అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ RRR అసహనం

image

2వ రోజు అసెంబ్లీ సమావేశాలలో డిప్యూటీ స్పీకర్ RRR అసహనం వ్యక్తం చేశారు. అనకాపల్లి MLA కొణతాల రామకృష్ణ గళం వినిపిస్తుండగా .. విప్‌లు మాట్లాడుకుంటూ ఉండడాన్ని తప్పుబట్టారు. విప్‌లు కాస్త మాటలు తగ్గించాలన్నారు. అత్యవసరమైతే బయటికి వెళ్లిపోవాలని సూచించారు. అలా కాదని సభలో గందరగోళం సృష్టిస్తూ అంతరాయం కలిగించవద్దని మనవి చేశారు.

News September 19, 2025

ఇది కదా అసలైన మార్పంటే.. హరీశ్ రావు సెటైర్

image

TG: తాము మేడిగడ్డ-మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు ₹84వేల కోట్లు వెచ్చిస్తే కాంగ్రెస్ తమ్మిడిహట్టి-ఎల్లంపల్లికి ₹35వేల కోట్లు కేటాయించిందని హరీశ్‌రావు విమర్శించారు. ‘కాళేశ్వరంతో 37లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలనేది లక్ష్యమైతే, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుతో కేవలం 4.47లక్షల ఎకరాలకే సాగు నీరట! ₹35వేల కోట్లతో కేవలం 4.47లక్షల ఎకరాలకు నీరివ్వాలనే ఆలోచన అద్భుతం. ఇది కదా అసలైన మార్పంటే?’ అని హరీశ్ సెటైర్ వేశారు.