News March 22, 2025
నారాయణపేట జిల్లాలో దారుణం.. భర్తను చంపిన భార్య

భూ వివాదం కారణంగా భర్తను భార్య చంపేసిన ఘటన నర్వలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. లంకల గ్రామానికి చెందిన పాలెం అంజన్న(41) NRPT జిల్లాలో అటెండర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ మధ్య కొంత భూమిని అమ్మగా, మిగిలిన భూమి తన పేరుపై చేయలేదని కోపంతో భర్త మెడకు తాడు బిగించి చంపింది. రంగమ్మపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మృతుడి అక్క పద్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని SI కురుమయ్య తెలిపారు.
Similar News
News March 23, 2025
సంగారెడ్డి: జిల్లాలో ఉష్ణోగ్రత వివరాలు విడుదల

జిల్లాలో ఆదివారం అత్యధికంగా నమోదైన ఉష్ణోగ్రత వివరాలను అధికారులు ప్రకటించారు. అత్యధికంగా వట్పల్లిలో 37.7, పాల్వంచలో 37.6, ఆందోలు మండలం అల్మాయిపేట 36.9, కల్హేర్లో 36.7, ఆందోలు మండలం అన్నాసాగర్లో 36.6, నారాయణఖేడ్ లో 36.4, జహీరాబాద్ మండలం అల్గోల్లో 36.2, చౌటకూర్, కందిలలో 36.1, నిజాంపేట, కోహీర్ మండలం దిగ్వల్, కొండాపూర్, పుల్కల్ లలో 36.0 ఉష్ణోగ్రత నమోదైనట్లు వివరించారు.
News March 23, 2025
నంద్యాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు.!

☞ నంద్యాలలో వార్డెన్ పై పోక్సో కేసు నమోదు
☞ శ్రీశైలంలో ఉగాది ప్రత్యేకతపై Way2 News ఫోకస్
☞ ఎర్ర బంగారంపై వర్ష ప్రభావం
☞ శ్రీశైలంలోని కృష్ణా నదిలో మునిగి యువకుడి మృతి
☞ నల్లమల్ల అడవుల్లో కన్నడ భక్తుల సందడి
☞ కొణిదెల గ్రామానికి రూ.50 లక్షలు: పవన్ కళ్యాణ్
☞ ఆళ్లగడ్డలో కిలో చికెన్ ధర రూ.90
☞ స్థల వివాదంతోనే సుధాకర్ రెడ్డి హత్య: బండి ఆత్మకూరు ఎస్ఐ
☞ PGRS వేళలో మార్పులు: కలెక్టర్
News March 23, 2025
అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

>అల్లూరి: లొంగిపోయిన ఇద్దరు మావోయిస్టులు>అల్లూరి జిల్లాలో ఈ నెల 26వరకూ తేలికపాటి వర్షాలు>రాజవొమ్మంగిలో వర్షం..చల్లబడ్డ వాతావరణం>దేవీపట్నం: ముసురిమిల్లి కాలువతో చెరువులకు నీటి సరఫరా>మూగజీవాల మృత్యుఘోష అధికారులకు పట్టదా>రంపచోడవరం: 4,400 మందికి ఉల్లాస్ పరీక్ష>పాడేరు: జాతీయోద్యమ స్ఫూర్తిని కొనసాగించాలి>అనంతగిరి మండలానికి పదోన్నతిపై ఏడుగురి కార్యదర్శులు.