News February 2, 2025
నారాయణపేట జిల్లాలో భారీ మొసలి కలకలం

నారాయణపేట జిల్లా నర్వ మండలం రాయికోడ్ గ్రామ సమీపంలో ఉన్న పొలంలో ఉదయం మొసలి కలకలం రేపింది. గ్రామ రైతు పొలంలో వెళ్తుండగా ఒడ్డున మొసలి కనిపించిందని తెలిపారు. పొలం మధ్యలో మొసలి ఉన్నట్లు అధికారులకు సమాచారం అందించారు. అటువైపు వెళ్లవద్దని, మత్స్యకారులు, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
Similar News
News December 5, 2025
ప.గో: ఆర్టీసీకి 1,050 కొత్త బస్సులు

రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీకి త్వరలో 1,050 కొత్త బస్సులు రానున్నాయని సంస్థ ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. గురువారం జంగారెడ్డిగూడెం డిపోను సందర్శించిన ఆయన మాట్లాడారు. కాలం చెల్లిన బస్సుల స్థానంలో సొంత, అద్దె బస్సులను ప్రవేశపెడతామన్నారు. దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సుల్లో స్త్రీల ఆక్యుపెన్సీ పెరిగిందని ఎండీ తెలిపారు.
News December 5, 2025
పాలమూరు: ఆడపిల్ల పుడితే రూ.10 వేలు.. బాండ్ పేపర్

ఆడపిల్ల పుడితే రూ.10 వేలు, గ్రామంలో ఎవరైనా చనిపోతే అంతక్రియల నిమిత్తం రూ.5 వేలు ఇస్తామని మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలం పగిడ్యాల్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి బోరు కవిత రాసిన హామీ బాండ్ పేపర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తనను గెలిపిస్తే ఇంటింటికి మరుగుదొడ్డి, విద్యార్థులకు సాయంత్రం ఉచిత తరగతులు, అన్ని వర్గాలకు కమ్యూనిటీ హాల్ తదితర 12 హామీలతో బాండ్ పేపర్ రాశారు. ఆమె BSC,B.ED పూర్తి చేసింది.
News December 5, 2025
గన్నవరం: వల్లభనేని వంశీ అనుచరుల్లో మరొకరి అరెస్ట్

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముఖ్య అనుచరుల్లో ఒకరైన యర్రంశెట్టి రామాంజనేయులు (ఏ9) పోలీసులు అరెస్ట్ చేశారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఇతను కీలకంగా వ్యవహరించి ఉన్నాడు. గురువారం కేసరపల్లిలోని ఆయన నివాసంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొంతకాలంగా ఇతను పరారీలో ఉన్నాడు. శుక్రవారం అతనిని కోర్టులో హాజరు పరచనున్నారు. ఇటీవల పలువురు వంశీ అనుచరులు కోర్టులో లొంగిపోయిన విషయం తెలిసిందే.


