News February 2, 2025

నారాయణపేట జిల్లాలో భారీ మొసలి కలకలం

image

నారాయణపేట జిల్లా నర్వ మండలం రాయికోడ్ గ్రామ సమీపంలో ఉన్న పొలంలో ఉదయం మొసలి కలకలం రేపింది. గ్రామ రైతు పొలంలో వెళ్తుండగా ఒడ్డున మొసలి కనిపించిందని తెలిపారు. పొలం మధ్యలో మొసలి ఉన్నట్లు అధికారులకు సమాచారం అందించారు. అటువైపు వెళ్లవద్దని, మత్స్యకారులు, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

Similar News

News November 15, 2025

ఏరో ఇంజిన్ రాజధానిగా తెలంగాణ: శ్రీధర్ బాబు

image

TG: ఏరో ఇంజిన్ రాజధానిగా తెలంగాణను తీర్చిదిద్దుతామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్య సాధనలో ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలదే కీలక పాత్ర అని చెప్పారు. ఇప్పటికే 25కు పైగా ‘A&D’ సంస్థలు, 1500కు పైగా MSMEలు ‘TG బ్రాండ్’ను విస్తరించాయని చెప్పారు. ₹800 CRతో JSW డిఫెన్స్ ‘UAV మాన్యుఫ్యాక్చరింగ్ UNIT’, ₹500 CRతో ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్ డిఫెన్స్ ఫెసిలిటీ వస్తున్నాయన్నారు.

News November 15, 2025

ADB: ఫెన్సింగ్ క్రీడాకారులకు శిక్షణ శిబిరం: సత్యనారాయణ

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎస్జిఎఫ్ ఫెన్సింగ్ జోనల్ స్థాయి పోటీలలో సెలెక్ట్ అయిన అండర్ 14,17క్రీడాకారులకు 18వ తేదిన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3:30 గంటల వరకు శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో ఒక్కరోజు క్యాంపు ఏర్పాటు చేయడం జరిగిందని అధ్యక్షుడు చిట్లా సత్యనారాయణ తెలిపారు. కావున అందరు కూడా ఎలిజిబుల్ ఫార్మ్స్‌తో హాజరు కాగలరని తెలిపారు. ఫోన్ 9550838190‌కు సంప్రదించాలన్నారు.

News November 15, 2025

తిప్పేస్తున్న జడేజా.. 6 వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా

image

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పట్టుబిగిస్తోంది. రెండో ఇన్నింగ్సులో RSA 75 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 4 వికెట్లతో సత్తా చాటారు. ప్రస్తుతం సౌతాఫ్రికా 45 పరుగుల లీడ్‌లో ఉంది. ఇవాళ మరో 17 ఓవర్ల ఆట మిగిలి ఉంది.