News February 11, 2025

నారాయణపేట జిల్లాలో మొత్తం ఎంపీటీసీ స్థానాలు ఎన్ని అంటే..?

image

నారాయణపేట జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లకు అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. సాధ్యమైనంత త్వరగా మండల పరిషత్, గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. జిల్లాలోని 13 మండలాల్లో 4,67,217 మంది ఓటర్లు ఉన్నారు. 3,500 మందికి ఒక MPTC చొప్పున జిల్లాలో 136 MPTC, 13 ZPTC స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ముందు సర్పంచ్ ఎన్నికలా.. లేక మండల పరిషత్ ఎన్నికలా? అన్న చర్చ ప్రజలలో జరుగుతోంది.

Similar News

News December 6, 2025

మొబైల్ రీఛార్జ్ ధరలపై యూజర్ల ఆగ్రహం!

image

కొన్నేళ్లుగా ఇంటర్నెట్ వినియోగం పెరిగింది. దీంతో వేగవంతమైన నెట్ సేవల ధరలూ పెరిగిపోయాయి. అయితే ఇతర దేశాలతో పోల్చితే రేట్లు మన దగ్గరే తక్కువ. కానీ ఒకప్పటితో పోల్చితే కనీస రీఛార్జ్ ధరలు భారీగా పెరిగాయని యూజర్లు వాపోతున్నారు. గతంలో రూ.10 రీఛార్జ్ చేసి కాల్స్ మాట్లాడుకునేవాళ్లమని, ఇప్పుడు కనీసం రూ.199 రీఛార్జ్ చేయాల్సి వస్తోందని మండిపడుతున్నారు. టెలికం సంస్థల దోపిడీని కేంద్రం అరికట్టాలని కోరుతున్నారు.

News December 6, 2025

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

<>ఎయిర్‌పోర్ట్స్ <<>>అథారిటీ ఆఫ్ ఇండియా 14 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు DEC12 – JAN 11వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, ఇంటర్, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 30ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష(CBT), డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. https://www.aai.aero/

News December 6, 2025

భక్తికి ప్రతీక ‘తిరుమలనంబి ఆలయం’

image

తిరుమలనంబి శ్రీవారికి సేవ చేయాలనే ఏకైక లక్ష్యంతో తిరుమలకు వచ్చిన మొదటి భక్తుడు. ఆయన భగవద్రామానుజులకు అలిపిరిలో రామాయణ రహస్యాలను బోధించారు. అందుకే, శ్రీవారి ఊరేగింపు సమయంలో, దక్షిణ మాడవీధిలో ఉన్న తిరుమలనంబి ఆలయం వద్ద స్వామివారు ఆగి, హారతిని స్వీకరించడం ఒక సంప్రదాయంగా మారింది. ఈ ఆలయం ఆయన గొప్ప భక్తికి, శ్రీవారిపై ఆయనకున్న ప్రేమకు నిదర్శనం. <<-se>>#VINAROBHAGYAMU<<>>