News February 11, 2025
నారాయణపేట జిల్లాలో మొత్తం ఎంపీటీసీ స్థానాలు ఎన్ని అంటే..?

నారాయణపేట జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లకు అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. సాధ్యమైనంత త్వరగా మండల పరిషత్, గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. జిల్లాలోని 13 మండలాల్లో 4,67,217 మంది ఓటర్లు ఉన్నారు. 3,500 మందికి ఒక MPTC చొప్పున జిల్లాలో 136 MPTC, 13 ZPTC స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ముందు సర్పంచ్ ఎన్నికలా.. లేక మండల పరిషత్ ఎన్నికలా? అన్న చర్చ ప్రజలలో జరుగుతోంది.
Similar News
News November 22, 2025
మధ్యాహ్నంలోగా రిపోర్ట్ అందజేయండి: అదనపు కలెక్టర్

గ్రామాల్లోని పోలింగ్ స్టేషన్లలో కనీస వసతులు కల్పించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మధుసూదన్ నాయక్ ఆదేశాలు జారీ చేశారు. పంచాయతీ అధికారిణి నిఖిలతో కలిసి శనివారం ఎంపీడీఓలు, ఎంపీవోలు గ్రామ పంచాయతీ కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని గ్రామాల్లోని పోలింగ్ స్టేషన్స్లో విద్యుత్, తాగునీరు, వికలాంగులు, వృద్ధులకు ర్యాంప్ సౌకర్యం వసతులు పరిశీలన చేసి.. మధ్యాహ్నంలోగా రిపోర్ట్ అందజేయాలన్నారు.
News November 22, 2025
HYD: నేడు సీఐడీ విచారణకు మంచులక్ష్మి

నేడు సీఐడీ విచారణకు మంచులక్ష్మి హాజరుకానుంది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో మంచు లక్ష్మిని సీఐడీ అధికారులు విచారణ చేపట్టనున్నారు. ఇప్పటికే ఈడీ విచారణను మంచులక్ష్మి ఎదుర్కొనగా.. మధ్యాహ్నం సీఐడీ సిట్ ఎదుట మంచు లక్ష్మి హాజరుకానున్నారు. కాగా, ఇప్పటికే రానా, విష్ణు ప్రియలను విచారించిన విషయం తెలిసిందే.
News November 22, 2025
కొమురవెల్లి మల్లన్న కొత్త రైల్వే స్టేషన్ త్వరలో ప్రారంభం

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న సన్నిధిలో నిర్మిస్తోన్న కొత్త రైల్వే స్టేషన్ పనులు 96% పూర్తయ్యాయి. త్వరలో ఆధునిక సౌకర్యాలతో ప్రజలకు అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ నుంచి వేలాది మంది భక్తులు రోజూ మల్లన్న దర్శనానికి రావడంతో ఈ స్టేషన్ నిర్మాణం వారి ప్రయాణాన్ని సులభతరం చేయనుంది. కొత్త రైల్వే సౌకర్యంతో భక్తులకు ప్రయాణ ఇబ్బందులు తగ్గి, ప్రాంతీయ రవాణా మరింత మెరుగవుతుంది.


