News March 11, 2025
నారాయణపేట జిల్లాలో వేసవి గండం..!

నారాయణపేట జిల్లాలోని పలు చెరువుల్లో నీటి మట్టం తగ్గిపోతున్నాయి. గత ఏడాది నీటి వనరులతో పోల్చుకుంటే ప్రస్తుత పరిస్థితి కాస్త నయమనిపిస్తున్నా, కొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే వేసవి నేపథ్యంలో జల వనరుల పరిస్థితి ఆందోళన కల్గిస్తుందని రైతులు అంటున్నారు. ఇదే సమయంలో మరికొన్ని గ్రామాల్లో చెరువులు అడుగంటి కనిపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు కూడా తగ్గిపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు.
Similar News
News November 24, 2025
పదేళ్లలో BRS ఇళ్లు, రేషన్ కార్డులు ఇవ్వలేదు: సీతక్క

పదేళ్లలో BRS ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయలేదని, ఇళ్లు, రేషన్ కార్డులు ఇవ్వలేదని మంత్రి సీతక్క విమర్శించారు. సోమవారం BHPL జిల్లా గోరి కొత్తపల్లిలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళా సంఘంలో సభ్యులు రోడ్డు ప్రమాదంలో మరణిస్తే ₹10 లక్షలు అందిస్తున్నామని అన్నారు. అలాగే, సంఘంలో లోన్ తీసుకున్న మహిళ చనిపోతే వారి లోన్ మాఫీ చేస్తున్నామన్నారు. జిల్లాలో ఇలా మరణించిన 64 మందికి లోన్ మాఫీ జరిగిందని ఆమె తెలిపారు.
News November 24, 2025
భద్రాద్రి BRSలో ముసలం.. రేగా వర్సెస్ సీనియర్లు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావుకు, సీనియర్లకు మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. అశ్వారావుపేట, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యేల మధ్య భేదాభిప్రాయాలు అధిష్ఠానానికి తలనొప్పిగా మారాయట. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీలో నెలకొన్న కుమ్ములాటల కారణంగా ఇబ్బందులు తప్పవని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
News November 24, 2025
మెదక్ జిల్లా జూనియర్ ఫారెస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అసీమ్ బిన్ అబ్దుల్లా

మెదక్ జిల్లా జూనియర్ ఫారెస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చిన్న శంకరంపేట ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అసీమ్ బిన్ అబ్దుల్లా ఎన్నికయ్యారు. మొత్తం 54 ఓట్లు పోలవ్వగా ఆసీమ్ బిన్ అబ్దుల్లాకు 41 ఓట్లు, గీత అగర్వాల్ 13 ఓట్లు వచ్చాయి.
ఈ ఎన్నికలను స్టేట్ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షించగా, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కేసన్న ఎన్నికల అధికారిగా వ్యవహారించారు.


