News March 11, 2025
నారాయణపేట జిల్లాలో వేసవి గండం..!

నారాయణపేట జిల్లాలోని పలు చెరువుల్లో నీటి మట్టం తగ్గిపోతున్నాయి. గత ఏడాది నీటి వనరులతో పోల్చుకుంటే ప్రస్తుత పరిస్థితి కాస్త నయమనిపిస్తున్నా, కొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే వేసవి నేపథ్యంలో జల వనరుల పరిస్థితి ఆందోళన కల్గిస్తుందని రైతులు అంటున్నారు. ఇదే సమయంలో మరికొన్ని గ్రామాల్లో చెరువులు అడుగంటి కనిపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు కూడా తగ్గిపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు.
Similar News
News December 9, 2025
నేడు అమరావతిలో పర్యటించనున్న మంత్రి నారాయణ

అమరావతి రాజధాని ప్రాంతంలో మంగళవారం మంత్రి నారాయణ పర్యటించనున్నట్లు ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఉదయం 8:30 నిమిషాలకు CRDA కార్యాలయం వద్ద బయలుదేరి అమరావతి రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లో జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలిస్తారని చెప్పారు. అనంతరం రోడ్ల నిర్మాణ పరులను పరిశీలించి మీడియాతో మంత్రి మాట్లాడతారని వెల్లడించారు.
News December 9, 2025
వనపర్తి: ఊర్లో ఎన్నిక.. సిటీలో ప్రచారం

నగరంలో బతుకుదెరువు, పొట్ట కూటి కోసం ఏదో ఒక పని చేసుకుంటూ రాష్ట్రంలోని ఆయా గ్రామాల నుంచి ఆయా వర్గాల ప్రజలు వచ్చి జీవిస్తుంటారు. ఈనెల14న జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా సోమవారం వనపర్తి మండలం పెద్ద తండా(డి) గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాత్లావత్ రాజ్యా నాయక్ బోయినపల్లి, బాపూజీనగర్, హస్మత్పేట, సెంటర్ పాయింట్ ఏరియాలలో ఓటర్లను కలిసి అభ్యర్థించారు.
News December 9, 2025
పవన్ దిష్టి వ్యాఖ్యలపై మంత్రి మనోహర్ ఏమన్నారంటే?

AP: Dy.CM పవన్ వ్యాఖ్యలను వక్రీకరించారని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కోనసీమకు దిష్టి తగిలిందని రైతులతో మాట్లాడిన సందర్భంలోనే అన్నారని, ఇది రాజకీయం చేయాల్సిన అంశం కాదని తెలిపారు. పవన్కు TG ప్రజలపై ఎంతో నమ్మకం, ప్రేమ ఉన్నాయని చెప్పారు. ఆ మాటలపై అనవసర రాద్దాంతం చేశారని పేర్కొన్నారు. పవన్ వ్యాఖ్యలపై ఇప్పటికే జనసేన ప్రకటన విడుదల చేయగా, మరో మంత్రి కందుల దుర్గేశ్ సైతం వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే.


