News March 21, 2025

నారాయణపేట జిల్లాలో 99.7% మంది హాజరు 

image

నారాయణపేట జిల్లా వ్యాప్తంగా శుక్రవారం 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు DEO గోవిందరాజులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 39 పరీక్ష కేంద్రాల్లో 10వ తరగతి పరీక్షలు జరిగాయి. ఈరోజు పరీక్షలకు 99.7% మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 7,635 మందికి 7,613 మంది పరీక్షలకు హాజరయ్యారు. కాగా 22 మంది పరీక్షలకు గైర్హాజరయ్యారు. వన్స్ ఫీల్డ్ క్యాండిడేట్స్ 6 మందికి 03 హాజరుకాగా 3 గైర్హాజరైనట్లు తెలిపారు.

Similar News

News November 25, 2025

VJA: భవానీలకు ఉచిత బస్సులు.. వసతుల కల్పనకు చర్యలు.!

image

విజయవాడ దుర్గమ్మ ఆలయానికి డిసెంబర్ 11 నుంచి 15 వరకు భవానీలు మాలవిరమణకు రానున్నారు. ఈ ఏడాది ఆరు లక్షల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని అంచనా. ఏర్పాట్లలో భాగంగా బస్టాండ్, రైల్వే స్టేషన్ల నుంచి భక్తుల కోసం 17 ఉచిత బస్సులు ఏర్పాటు చేశారు. వాటర్ బాటిళ్లు, క్లోరినేషన్, కేశఖండనశాలలో సిబ్బంది, ఉచిత ప్రసాదాల పంపిణీ వంటి సదుపాయాలు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

News November 25, 2025

యాదాద్రీశుడి హుండీలో 20 దేశాల కరెన్సీ

image

యాదాద్రి శ్రీవారి దేవస్థానం హుండీ ఆదాయం సోమవారం లెక్కించారు. 20 దేశాల కరెన్సీ స్వామి వారి ఖజానాకు సమకూరినట్లు EO వెంకట్రావు తెలిపారు. అమెరికా 2,014, ఆస్ట్రేలియా 75, ఇంగ్లండ్ 65, సౌదీ అరేబియా 61, ఒమన్ 2, మలేషియా 51, యూరో 15, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 970, కెనడా 1245, న్యూజిలాండ్ 95, శ్రీలంక 500, బహ్రెయిన్ 2, అరబ్ ఎమిరేట్స్ 70, సింగపూర్ 41, ఖతార్ 318, చైనా 20 తదితర దేశాల కరెన్సీ నోట్లు వచ్చాయన్నారు.

News November 25, 2025

ఆలయ అకౌంట్ నుంచి డబ్బు వెనక్కి రప్పించాలి: CCIకి అధికారుల విజ్ఞప్తి

image

<<18381330>>రాజన్న ఆలయ ట్రస్టు ఖాతాలో<<>> జమ అయిన ఏదుల సత్తమ్మకు చెందిన రూ.2,14,549లను వెనక్కి తెప్పించి రైతుకు అందజేయాలని సీసీఐ అధికారులకు వేములవాడ మార్కెట్ కమిటీ సెక్రటరీ విజ్ఞప్తి చేశారు. సత్తమ్మ ఆధార్ కార్డుకు రాజన్న ఆలయ బ్యాంకు అకౌంటు లింక్ అయి ఉండడంతో ఆమె పత్తి విక్రయించిన సొమ్ము ఆలయ ఖాతాలో జమ అయింది. కాగా, ప్రైవేటు వ్యక్తి ఆధార్ నంబర్‌తో రాజన్న ఆలయ అకౌంటు లింక్ అయి ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది.