News March 21, 2025
నారాయణపేట జిల్లాలో 99.7% మంది హాజరు

నారాయణపేట జిల్లా వ్యాప్తంగా శుక్రవారం 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు DEO గోవిందరాజులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 39 పరీక్ష కేంద్రాల్లో 10వ తరగతి పరీక్షలు జరిగాయి. ఈరోజు పరీక్షలకు 99.7% మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 7,635 మందికి 7,613 మంది పరీక్షలకు హాజరయ్యారు. కాగా 22 మంది పరీక్షలకు గైర్హాజరయ్యారు. వన్స్ ఫీల్డ్ క్యాండిడేట్స్ 6 మందికి 03 హాజరుకాగా 3 గైర్హాజరైనట్లు తెలిపారు.
Similar News
News November 13, 2025
పానగల్: తహశీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

పానగల్ తహశీల్దార్ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్ రెవెన్యూ కీమ్యా నాయక్ సందర్శించి పరిశీలించారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ అంశాలపై అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్ సమీక్ష నిర్వహించారు. భూభారతి దరఖాస్తుల పురోగతిపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. రికార్డు రూమ్ను తనిఖీ చేసి, రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సిబ్బందికి ఆదేశించారు. అధికారులు తదితరులు పాల్గొన్నారు.
News November 13, 2025
ఐఫోన్ పెట్టుకునేందుకు ‘పాకెట్’.. ధర తెలిస్తే షాక్!

ఐఫోన్ పెట్టుకునేందుకు ‘యాపిల్’ కంపెనీ తీసుకొచ్చిన ‘ఐఫోన్ పాకెట్’పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఆ పాకెట్ ధర $229.95. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.20,390. ధర ఎక్కువగా ఉండటంతో పాటు దాని డిజైన్ సాక్స్ను పోలి ఉండటంతో ట్రోల్స్ మరింతగా పెరిగాయి. జపనీస్ ఫ్యాషన్ లేబుల్ ‘ఇస్సే మియాకే’ తో కలిసి ఈ పాకెట్ను రూపొందించినట్లు, పరిమిత సంఖ్యలోనే వీటిని విక్రయించనున్నట్లు యాపిల్ ప్రకటించింది.
News November 13, 2025
సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన ఎస్పీ

సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ను ఎస్పీ నరసింహ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లో ఉన్న పలు రికార్డులను, పరిసరాలు, ఫిర్యాదుల నిర్వహణ, రిసెప్షన్ మేనేజ్మెంట్ మొదలగు అంశాలను పరిశీలించారు. పోలీస్ స్టేషన్కు వచ్చిన బాధితులతో మాట్లాడి ఫిర్యాదులను త్వరితగతిన పరిశీలించాలని ఎస్సైని ఆదేశించారు. జాతీయ రహదారి వెంట పటిష్టమైన నిఘా ఉంచి భద్రత పర్యవేక్షించాలన్నారు.


