News April 4, 2025
నారాయణపేట జిల్లా కలెక్టర్ అసహనం

నర్వ మండలం పాతర్చేడ్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని గురువారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో చిన్నారులకు కుర్చీలు, ఆట పరికరాలు అందుబాటులో ఉన్నాయా.. లేదా అని అడిగి తెలుసుకున్నారు. చిన్నారుల అభ్యాసన సామర్థ్యాన్ని పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రం ఇరుకైన గదుల్లో కొనసాగుతుండటంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా విశాలంగా వున్న గదుల్లోకి మార్చాలని ఆదేశించారు.
Similar News
News November 19, 2025
GNT: 26న జెడ్పీ స్థాయి సంఘ సమావేశం

జిల్లా పరిషత్ 6వ స్థాయి సంఘ సమావేశాన్ని ఈ నెల 26న నిర్వహిస్తున్నట్లు జెడ్పీ ముఖ్య కార్య నిర్వహణాధికారి వి. జ్యోతిబాసు తెలిపారు. ఉదయం 10:30 నుంచి ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఛాంబర్లో జిల్లా పరిషత్ వైస్ ఛైర్పర్సన్ అనురాధ అధ్యక్షతన స్థాయి సంఘ సమావేశం జరుగుతుందన్నారు. సాంఘిక, గిరిజన, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లు, తదితర అంశాలపై సమీక్ష జరుగుతుందన్నారు.
News November 19, 2025
రూ.1.25కోట్ల ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి.. కానీ!

యువత, విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలని రాజకీయ ఉద్ధండులు పిలుపునివ్వడం చూస్తుంటాం. అలా ప్రజాశ్రేయస్సు కోసం ఏకంగా రూ.1.25కోట్ల ఉద్యోగాన్ని వదిలొచ్చి పోటీ చేసి ఓడిపోయాడో యువకుడు. ఐఐటీ ఢిల్లీ, ఐఐఎం కోల్కత్తాలో చదివి జర్మనీలో ఉద్యోగం చేస్తోన్న శశాంత్ శేఖర్ కాంగ్రెస్ తరఫున బిహార్ ఎన్నికల్లో పోటీ చేశారు. పట్నా సాహిబ్లో బీజేపీ అభ్యర్థి రత్నేష్ కుమార్ చేతిలో ఆయన 38,900 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
News November 19, 2025
వెంకటపాలెం: సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ

తుళ్లూరు మండలం వెంకటపాలెంలోని తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ నెల 27వ తేదీన రెండవ ప్రాకారం నిర్మాణానికి సీఎం చంద్రబాబు హాజరవుతున్న విషయం తెలిసిందే. కలెక్టర్ తమీమ్ అన్సారీయా, ఎస్పీ వకుల్ జిందాల్ ఆధ్వర్యంలో బుధవారం ఉన్నతాధికారుల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ప్రశాంత వాతావరణంలో కార్యక్రమం జరిగేలా అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులతో చర్చించారు.


