News April 4, 2025
నారాయణపేట జిల్లా కలెక్టర్ అసహనం

నర్వ మండలం పాతర్చేడ్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని గురువారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో చిన్నారులకు కుర్చీలు, ఆట పరికరాలు అందుబాటులో ఉన్నాయా.. లేదా అని అడిగి తెలుసుకున్నారు. చిన్నారుల అభ్యాసన సామర్థ్యాన్ని పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రం ఇరుకైన గదుల్లో కొనసాగుతుండటంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా విశాలంగా వున్న గదుల్లోకి మార్చాలని ఆదేశించారు.
Similar News
News December 3, 2025
VZM: ‘64 మందికి జరిమానాలు, ఇద్దరికి జైలు’

విజయనగరం పట్టణంలో జరిగిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో 66 మంది వాహనదారులు పట్టుబడ్డారు. కోర్టు విచారణలో 64 మందికి రూ.10,000 చొప్పున జరిమానా.. ఇద్దరికి వరుసగా 2 రోజులు, 5 రోజుల జైలు శిక్ష విధించామని ఎస్పీ దామోదర్ మంగళవారం తెలిపారు. రహదారి ప్రమాదాల నివారణకు మద్యం తాగి వాహనం నడపకూడదని, భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు.
News December 3, 2025
ఏ పాఠశాలలోనూ ఫ్లెక్సీలు కట్టరాదు: బాపట్ల కలెక్టర్

పాఠశాలలకు మంజూరైన పరికరాలు, ఆట వస్తువులన్నింటిని పీటీఎం కార్యక్రమంలో ప్రదర్శనకు ఉంచాలని కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలను పీటీఎంకు ఆహ్వానించాలన్నారు. ఏ పాఠశాలలోనూ ఫ్లెక్సీలు కట్టరాదన్నారు. పదో తరగతి పరీక్షల్లో 100శాతం విద్యార్థుల ఉత్తీర్ణత ఉండాలన్నారు. విద్యార్థుల సామర్థ్యం గుర్తించే సమయంలో నిర్దిష్ట జాగ్రత్తలు పాటించాలని, అపార్ ఐడీ నూరు శాతం నవీకరణ చేయాలన్నారు.
News December 3, 2025
ఖమ్మం: ఎన్నికల లెక్క తప్పితే వేటు తప్పదు..!

స్థానిక ఎన్నికల నేపథ్యంలో జనాభా ప్రాతిపదికన ప్రచార ఖర్చులను సర్పంచికి రూ.2.5 లక్షల నుంచి రూ.1.5 లక్షల వరకు ఈసీ ఖరారు చేసింది. గ్రామాల్లో పోటీ చేసే సర్పంచ్, వార్డు అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా లెక్కకు మించి భారీగా వెచ్చిస్తున్నారు. దీంతో డబ్బు ప్రవాహం కట్టడికి ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు చేపట్టింది. గ్రామాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేసి పరిశీలిస్తోంది. వ్యయ పరిమితి దాటితే వేటు తప్పదు జాగ్రత్త.


