News April 4, 2025
నారాయణపేట జిల్లా రైతులకు కలెక్టర్ ముఖ్య గమనిక

రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో వరి ధాన్యం (సన్న రకం) కొనుగోలుకు సంబంధించి క్వింటాకు రూ.500 బోనస్ ప్రకటించిందని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. అయితే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే విషయంలో కొనుగోలు కేంద్రాల్లో నిబంధనలు తప్పని సరిగా పాటించాలని అన్నారు. గురువారం నారాయణపేట నైపుణ్య అభివృద్ధి కేంద్రంలో వరి కొనుగోలు కేంద్రాలపై అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు.
Similar News
News April 18, 2025
మొక్కల ఆధారిత ప్రొటీన్లతో ఎక్కువ ఆయుర్దాయం

శరీరానికి విటమిన్లతో పాటు ప్రొటీన్లు చాలా అవసరం. వాటి కోసం మాంసాన్ని ఆశ్రయిస్తుంటాం. అయితే మొక్కల ఆధారిత(శనగలు, బఠానీలు, టోఫు) ప్రొటీన్లు తీసుకునే దేశాల్లో వయోజన ఆయుర్దాయం ఎక్కువని సిడ్నీ వర్సిటీ అధ్యయనంలో తేలింది. దీర్ఘకాలిక వ్యాధులు, అకాల మరణాల ప్రమాదం తక్కువగా ఉంటుందని వెల్లడైంది. 1961-2018 మధ్య 101 దేశాల్లో ఆహార సరఫరా, జనాభా డేటా ఆధారంగా సైంటిస్టులు ఈ అధ్యయనం చేశారు.
News April 18, 2025
శాంతి భద్రతలకు ప్రతి ఒక్కరూ సహకరించాలి: డీసీపీ

శాంతిభద్రతలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ సూచించారు. నర్సంపేటలోని బస్టాండ్ ఆవరణలో స్పెషల్ ట్రైన్డ్ నార్కో అనాలసిస్ డాగ్ స్క్వాడ్ సహకారంతో శుక్రవారం తనిఖీలు చేపట్టారు. గంజాయి ఇతర మత్తు పదార్థాల రవాణా నియంత్రణకు ఈ తనిఖీలు చేపట్టినట్లు డీసీపీ అంకిత్ కుమార్ తెలిపారు. ఏసీపి కిరణ్ కుమార్, సిఐ రమణమూర్తి, ఎస్సైలు రవికుమార్, అరుణ్ తదితరులు ఉన్నారు.
News April 18, 2025
త్వరలో EPFO 3.0.. సేవలు సులభతరం: మాండవీయ

ఈపీఎఫ్వో చందాదారులకు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ శుభవార్త చెప్పారు. సేవలను సులభతరం చేసేందుకు అత్యాధునిక ఫీచర్లతో మే/జూన్కు EPFO 3.0ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఆటో క్లెయిమ్, డిజిటల్ కరెక్షన్స్, ATM ద్వారా నగదు విత్డ్రా వంటి సదుపాయాలు ఉంటాయని వెల్లడించారు. క్లెయిమ్లు, కరెక్షన్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరగడం, ఫారాలు నింపడం వంటి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు.