News April 4, 2025
నారాయణపేట జిల్లా రైతులకు కలెక్టర్ ముఖ్య గమనిక

రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో వరి ధాన్యం (సన్న రకం) కొనుగోలుకు సంబంధించి క్వింటాకు రూ.500 బోనస్ ప్రకటించిందని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. అయితే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే విషయంలో కొనుగోలు కేంద్రాల్లో నిబంధనలు తప్పని సరిగా పాటించాలని అన్నారు. గురువారం నారాయణపేట నైపుణ్య అభివృద్ధి కేంద్రంలో వరి కొనుగోలు కేంద్రాలపై అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు.
Similar News
News April 21, 2025
నేటి నుంచి 57 నగరాల్లో కాంగ్రెస్ ప్రెస్మీట్లు

నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ED ఛార్జిషీట్ ఫైల్ చేయడాన్ని నిరసిస్తూ ఇవాళ్టి నుంచి ఈనెల 24 వరకు ప్రెస్ మీట్లు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ తెలిపింది. ‘కాంగ్రెస్ నిజాలు, బీజేపీ అబద్ధాలు’ క్యాంపెయిన్లో భాగంగా కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడతామంది. దేశంలోని 57 నగరాల్లో పార్టీ నేతలు ప్రెస్మీట్లు నిర్వహిస్తారని వెల్లడించింది. ఈ మేరకు సిటీస్, నేతల పేర్లతో జాబితా విడుదల చేసింది.
News April 21, 2025
చమురు దిగుమతుల ఖర్చు ₹13.76L Cr

FY25లో భారత్ 24.24 కోట్ల టన్నుల క్రూడ్ ఆయిల్ను దిగుమతి చేసుకుంది. దీని విలువ ₹13.76 లక్షల కోట్లు. FY24తో పోలిస్తే 4.2% ఎక్కువ. మొత్తం దేశీయ చమురు అవసరాల్లో 89.1% దిగుమతుల ద్వారానే రావడం గమనార్హం. ఇదే సమయంలో దేశీయ చమురు ఉత్పత్తి 2.94 కోట్ల టన్నుల నుంచి 2.87 కోట్ల టన్నులకు తగ్గింది. గ్యాస్ దిగుమతి 15.4% పెరిగి 3,666MMSCM(మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్)కు చేరింది.
News April 21, 2025
IPL: ఇవాళ కీలక పోరు

కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో ఇవాళ GT, KKR మధ్య మ్యాచ్ జరగనుంది. 7 మ్యాచ్ల్లో 5 విజయాలతో టేబుల్ టాపర్గా ఉన్న గుజరాత్ తన స్థానాన్ని పదిలం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు ఏడింట్లో 3 గెలిచి ఏడో స్థానంలో ఉన్న కోల్కతా ప్లేఆఫ్స్ వెళ్లాలంటే ఈ మ్యాచ్ కీలకం కానుంది. ఇరు జట్లు ఇప్పటివరకు 4 సార్లు తలపడగా GT 2, KKR ఒక మ్యాచ్లో గెలుపొందాయి. ఒకటి రద్దైంది. ఇవాళ ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.