News April 1, 2025
నారాయణపేట: భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య

భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని తీలేరు గ్రామంలో చోటుచేసుకుంది. మరికల్ ఎస్ఐ రాము కథనం మేరకు.. తీలేరు గ్రామానికి చెందిన సుభాష్కు తన భార్యకు కొన్ని రోజుల క్రితం గొడవలు జరగగా ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. కాపురానికి రమ్మన్నా ఆమె రాకపోవడంతో మనస్తాపం చెందిన సుభాష్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Similar News
News December 6, 2025
‘రైట్ టు డిస్కనెక్ట్’.. ఏ దేశాల్లో అమల్లో ఉంది?

పని వేళలు పూర్తయ్యాక ఉద్యోగులు ఆఫీస్ కాల్స్ను <<18487853>>డిస్ కనెక్ట్<<>> చేసే హక్కును 2017లో ఫ్రాన్స్ చట్టబద్ధం చేసింది. ఆ తర్వాత స్పెయిన్, ఇటలీ, ఐర్లాండ్, బెల్జియం దేశాలు ఈ తరహా చట్టాలను తీసుకొచ్చాయి. ఇది ఉద్యోగుల వర్క్ లైఫ్ బ్యాలెన్స్, మెంటల్ హెల్త్, వారి శ్రేయస్సు, ప్రొడక్టివిటీకి ముఖ్యమని పేర్కొన్నాయి. ఇండియాలోనూ 2018, 2025లో ఇలాంటి ప్రైవేట్ బిల్లులు ప్రవేశపెట్టారు. కానీ చట్టరూపం దాల్చలేదు.
News December 6, 2025
నంద్యాలలో ఘనంగా 63 వ హోంగార్డు వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు

నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా 63 హోంగార్డు వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. హోంగార్డులు నైపుణ్యతను పెంచుకొని పోలీసులకు దీటుగా విధి నిర్వహణ చేస్తున్నారని తెలిపారు. వారి సేవలు అద్భుతమని, అభినందనీయమని తెలిపారు.
News December 6, 2025
కరీంనగర్: ఈ నెల 22 వరకూ ఫీజు చెల్లించవచ్చు

డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పీజీ ప్రథమ, ద్వితీయ, ఎంబీఏ తృతీయ, ద్వితీయ విడత సప్లిమెంటరీ పరీక్షా ఫీజు గడువు ఈనెల 22 వరకు ఉన్నట్లు కరీంనగర్ స్టడీ సెంటర్ కో-ఆర్డినేటర్ ఏం సత్య ప్రకాష్ తెలిపారు. ఫీజును ఆన్లైన్లో చెల్లించవచ్చని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు అధ్యయన కేంద్రంలో సంప్రదించాలని సూచించారు.


