News April 7, 2025
నారాయణపేట: ‘మాంసం వారానికి ఒకసారే తినండి’

ఉమ్మడి <<16019120>>పాలమూరులో<<>> 18 ఏళ్లు పైబడిన వారిలో సగటున 20 శాతం అంటే 87,739 మంది అధిక రక్తపోటు బాధితులే ఉన్నారు. క్యాన్సర్ రోగులు 188 మంది, మధుమేహ వ్యాధిగ్రస్థులు 50,421 మంది ఉన్నారు. మటన్, ఆయిల్ఫుడ్, అధిక ఉప్పు, పచ్చడి, తంబాకు, గుట్కా, బ్రెడ్, బేకరీ ఫుడ్ తినొద్దని, స్కిన్లెస్ చికెన్, గుడ్డు తెల్ల సొన, ఉడకబెట్టిన కూరగాయలు, పాలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. వారానికి ఒకసారి మాత్రమే మాంసం తినాలన్నారు.
Similar News
News November 27, 2025
కరీంనగర్: నియోజకవర్గానికి దూరంగా ఎమ్మెల్యేలు..?

పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ MLAలకు తలనొప్పిగా మారింది. పార్టీ కోసం పనిచేసిన సీనియర్ కార్యకర్తలు అధిక సంఖ్యలో ఆశావహులుగా ఉండటమే ఇందుకు కారణం. ఒక్కో గ్రామంలో 5 నుంచి 10 మంది వరకు తమ అభ్యర్థిత్వం ఖరారు చేయాలని MLAలపై ఒత్తిడి తెస్తున్నారట. దీంతో MLAలు ఎటూ తేల్చుకోలేక మండల అధ్యక్షులకు ఎంపిక బాధ్యతలను అప్పజెప్పుతుండగా మరి కొంతమంది MLAలు నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నట్లు సమాచారం.
News November 27, 2025
RECORD: వికెట్ కోల్పోకుండా 177 రన్స్

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కేరళ ఓపెనర్లు రోహన్ కున్నుమ్మల్, సంజూ శాంసన్ రికార్డు సృష్టించారు. ఒడిశాతో మ్యాచులో వికెట్ కోల్పోకుండా 177 రన్స్ చేశారు. రోహన్ 60 బంతుల్లో 10 సిక్సులు, 10 ఫోర్లతో 121*, సంజూ 41 బంతుల్లో 51* పరుగులు బాదారు. ఈ టోర్నీ హిస్టరీలో ఇదే అత్యధిక ఓపెనింగ్ పార్ట్నర్షిప్. ఈ మ్యాచులో తొలుత ఒడిశా 20 ఓవర్లలో 176/7 స్కోరు చేయగా, కేరళ 16.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.
News November 27, 2025
ఎల్లారెడ్డి: అనుమానిస్తున్నాడని భర్తను చంపేసింది

ఎల్లారెడ్డిలో నిత్యం అనుమానంతో వేధిస్తున్నాడని <<18394792>>భర్తను భార్య హత్య చేసిన విషయం తెలిసిందే.<<>> SI మహేష్ వివరాల ప్రకారం.. బాలాజీనగర్ తండా వాసి తుకారాం(36) కొన్ని రోజులుగా తన భార్య మీనాపై అనుమానం పెంచుకున్నాడు. దీంతో వారిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈనెల 25న రాత్రి మీనా దిండుతో అదిమి తుకారాన్ని హత్య చేసింది. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


