News April 11, 2025
నారాయణపేట: మార్కెట్లో ధరలు లేక ఉల్లి రైతుల ఆందోళన

ఈ ఏడాది ఆశించిన స్థాయిలో ఉల్లి ధరలు లేకపోవడంతో నారాయణపేటలోని పలువురు రైతులు పంటను కోసి పొలాల వద్ద నిల్వ చేశారు. మార్కెట్లో రోజు రోజుకు ఉల్లి ధరలు పడిపోతుండడమే ఇందుకు కారణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట దిగుబడి పెరిగినా.. తగ్గినా గిట్టుబాటు ధరలు లేక రైతులు కోసిన ఉల్లి పంటను పొలాల వద్ద, ఇంటి వద్ద నిల్వ చేసుకున్నారు. రానున్న రోజుల్లో ఉల్లి ధరలు పెరుగుతాయన్న ఆశతో రైతులు ఎదురుచూస్తున్నారు.
Similar News
News April 20, 2025
Google: భారీగా భారత ఉద్యోగుల తొలగింపు!

గూగుల్ సంస్థ పునర్నిర్మాణంలో భాగంగా భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమవుతోంది. ఈ నిర్ణయం భారత్పై తీవ్ర ప్రభావం చూపనుంది. హైదరాబాద్, బెంగళూరు ఆఫీసుల్లోని వందలాది మంది ఎంప్లాయిస్కు లేఆఫ్స్ ప్రకటించనున్నట్లు సమాచారం. వచ్చే వారం నుంచే జాబ్ కట్స్ మొదలవ్వొచ్చని బిజినెస్ స్టాండర్డ్ నివేదిక తెలిపింది. యాడ్స్, సేల్స్, మార్కెటింగ్ టీమ్స్పై ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందని తెలుస్తోంది.
News April 20, 2025
మనుబోలు: పంట కాలువలోకి దూసుకెళ్లిన కారు

మనుబోలు మండలంలోని వడ్లపూడి వద్ద ఆదివారం కారు బోల్తా పడి అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో కారులో ఐదుమంది ఉన్నారు. వీళ్లంతా సురక్షితంగా బయటపడ్డారు. పొదలకూరు మండలం బిరదవోలు రాజుపాలెంకు చెందిన వారు కొత్త కారును కొనుగోలు చేసి గొలగమూడిలో పూజలు చేయించుకొని తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
News April 20, 2025
కృష్ణా: LLB పరీక్షల ఫలితాలు విడుదల

కృష్ణా యూనివర్శిటీ పరిధిలో ఇటీవల నిర్వహించిన LLB 3వ, 7వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని KRU పరీక్షల విభాగం సూచించింది.