News February 11, 2025

నారాయణపేట మార్కెట్లో పెరిగిన వేరుశనగ ధరలు

image

నారాయణపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో వేరుశనగ ధరలు కాస్త పెరిగాయి. మంగళవారం 520.80 క్వింటాళ్ల వేరుశనగ రాగ, క్వింటాలుకు గరిష్టంగా రూ. 6,269, కనిష్టంగా రూ. 3,869 ధర పలికింది. అదేవిధంగా 54.39 క్వింటాళ్ల తెల్ల కందులు రాగ, క్వింటాలుకు గరిష్టంగా రూ. 8,000, కనిష్టంగా రూ. 6,212, 122.50 క్వింటాళ్ల ఎర్ర కందులు రాగ, గరిష్టంగా క్వింటాలుకు రూ. 7,750, కనిష్టంగా రూ. 6,222 ధర పలికిందని అన్నారు.

Similar News

News December 13, 2025

ఈనెల 18న ఆత్మకూరులో కబడ్డీ జిల్లా సెలక్షన్స్

image

యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయి సీనియర్ కబడ్డీ సెలక్షన్స్ డిసెంబర్ 18న ఆత్మకూరు జెడ్పీహెచ్‌ఎస్‌లో జరుగుతాయని జిల్లా మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు పూర్ణచందర్ రాజ్ తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు 18వ తేదీ ఉదయం 9 గంటలకు ఆధార్ కార్డుతో పీఈటీ ఇందిరకి రిపోర్ట్ చేయాలని సూచించారు. ఎంపికైన జట్టు డిసెంబర్ 25న ఖమ్మంలో ఆడునుందని పేర్కొన్నారు.

News December 13, 2025

చౌటుప్పల్: ‘ఆస్తులు పెరిగితే గ్రామానికే రాసిస్తా’

image

యాదాద్రి జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఇందులో భాగంగా చౌటుప్పల్ మండలంలో దేవలమ్మ నాగారం సర్పంచ్‌ అభ్యర్థి కొండ హారిక విజయ్ వినూత్నంగా హామీ ఇచ్చారు. ఎన్నికల అనంతరం తన ఆస్తులు పెరిగితే ఆ పెరిగిన ఆస్తులన్నింటినీ గ్రామాభివృద్ధికి ప్రజల పేరున రాసిస్తానని బాండ్‌ పేపర్‌పై రాసి ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. కాగా హారిక విజయ్‌ హామీ ప్రస్తుతం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.

News December 13, 2025

మంచి నాయకుడి కోసం.. ఒక్కరోజు వెచ్చిద్దాం!

image

పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఓటూ వజ్రాయుధమే. ఊరిని అభివృద్ధి చేసే సమర్థుడైన నాయకుడిని ఎన్నుకోవడం మన బాధ్యత. ఒక్కరోజు సెలవు, కూలీ డబ్బులు పోయినా పర్వాలేదు.. మన ఊరి భవిష్యత్తు కోసం వచ్చామన్న తృప్తి ముఖ్యం. మీ ఓటుతో మంచి నాయకుడు గెలిస్తే ఆ ఊరంతా బాగుపడుతుంది. అందుకే డబ్బు, బంధుప్రీతి వంటి ప్రలోభాలకు లొంగకుండా, స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోండి. నిజాయితీ గల నాయకుడిని గెలిపించండి.