News February 11, 2025

నారాయణపేట మార్కెట్లో పెరిగిన వేరుశనగ ధరలు

image

నారాయణపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో వేరుశనగ ధరలు కాస్త పెరిగాయి. మంగళవారం 520.80 క్వింటాళ్ల వేరుశనగ రాగ, క్వింటాలుకు గరిష్టంగా రూ. 6,269, కనిష్టంగా రూ. 3,869 ధర పలికింది. అదేవిధంగా 54.39 క్వింటాళ్ల తెల్ల కందులు రాగ, క్వింటాలుకు గరిష్టంగా రూ. 8,000, కనిష్టంగా రూ. 6,212, 122.50 క్వింటాళ్ల ఎర్ర కందులు రాగ, గరిష్టంగా క్వింటాలుకు రూ. 7,750, కనిష్టంగా రూ. 6,222 ధర పలికిందని అన్నారు.

Similar News

News March 28, 2025

కొవ్వూరు: ప్రభాకర్ మర్డర్ కేసులో వీడని మిస్టరీ..

image

కొవ్వూరు మండలం దొమ్మేరులో గురువారం జరిగిన పి.ప్రభాకర్ మర్డర్ కేసులో మిస్టరీ ఇంకా వీడలేదు. ఆయుర్వేదం షాప్ నడుపుతున్న ఆయనకు బుధవారం రాత్రి ఫోన్ కాల్ రావడంతో బయటికి వెళ్లి పొలంలో విగతజీవిగా మారాడు. దుండగులు అతడిపై కత్తితో దాడి చేసి కుడి చేతిని నరికి హస్తాన్ని తీసుకుపోయారు. సీసీ ఫుటేజ్, చివరి ఫోన్ కాల్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఏఎస్పీ సుబ్బరాజు పర్యవేక్షణలో కేసు దర్యాప్తు జరుగుతోంది.

News March 28, 2025

VZM: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

image

ఎస్.కోట మండలం కొత్తూరు సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బసనబోయిన కార్తీక్ (21) మృతి చెందాడు. ఇతను తన స్నేహితులతో కలసి ఎస్.కోట నుంచి స్కూటీపై ఎల్.కోట పండక్కి వెళ్తున్న నేపథ్యంలో కొత్తూరు సమీపంలో ఎదురుగా వస్తున్న బైకు ఢీకొట్టింది. స్కూటీపై ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఎస్.కోట పీహెచ్సీకి తరలించగా కార్తీక్ మృతి చెందినట్లు మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు.

News March 28, 2025

ప్రపంచ కుబేరుల జాబితాలో తెలుగువారు

image

260వ ర్యాంకు- దివి మురళి.. దివీస్ ($ 10B)
600- P పిచ్చిరెడ్డి.. MEIL ($5.8B)
625- PV కృష్ణారెడ్డి.. MEIL ($5.6B)
1122- ప్రతాప్ సి.రెడ్డి.. అపోలో హస్పిటల్స్ ($3.3B)
1122- PV రాంప్రసాదరెడ్డి.. అరబిందో ఫార్మా ($3.3B)
1198- B పార్థసారథిరెడ్డి.. హెటిరో ల్యాబ్స్ ($3.1B)
1624- K సతీశ్ రెడ్డి.. డాక్టర్ రెడ్డీస్ ($2.3B)
1796- M సత్యనారాయణరెడ్డి.. అపర్ణ కన్‌స్ట్రక్షన్స్ ($2.1B)

error: Content is protected !!