News January 24, 2025
నారాయణపేట: మూడో రోజు 13,113 దరఖాస్తులు

నారాయణపేట జిల్లాలో ప్రజా పాలన గ్రామ, వార్డు సభలు నిరసనలు, నిలదీతల మధ్య జరుగుతున్నాయి. మూడో రోజు 71 గ్రామ, 13 వార్డు సభలు నిర్వహించారు. జిల్లాలో మొత్తం 13,113 దరఖాస్తులు రాగా ఇందులో రేషన్ కార్డుకు 4,111, ఇళ్లకు 7,291, రైతు భరోసాకు 470, ఆత్మీయ భరోసాకు 1,241 వచ్చాయి. అర్హత ఉన్నా జాబితాలో తమ పేర్లు లేవని అధికారులను పలువురు నిలదీశారు. జాబితాలో పేరు లేని వారు మళ్లీ అప్లై చేసుకోవాలని అధికారులు సూచించారు.
Similar News
News November 12, 2025
VZM: హోంగార్డ్స్ పిల్లలకు స్కాలర్షిప్లు

2023-24 విద్యా సంవత్సరంలో ప్రతిభ కనబరిచిన 16మంది హెూంగార్డ్స్ పిల్లలకు రూ.2000 చొప్పున మెరిట్ స్కాలర్షిప్లు జిల్లా ఎస్పీ దామోదర్ తన కార్యాలయంలో నేడు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఉన్నత విద్యతోనే భవిష్యత్తు బలపడుతుందని, విద్యార్థులు క్రమశిక్షణతో చదువులో రాణించాలని సూచించారు. హెూంగార్డ్స్ సంక్షేమం కోసం ఇలాంటి ప్రోత్సాహకాలు కొనసాగుతాయని తెలిపారు.
News November 12, 2025
వనపర్తి: నూతన ఇన్ఛార్జ్ DMHOగా సాయినాథ్ రెడ్డి

వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ డీఎంహెచ్ఓ (జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి)గా జిల్లా టీబీ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సాయినాథ్ రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా టీబీ డిపార్ట్మెంట్ జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్ భాషిత్ ఖాన్, టెక్నీషియన్ మధు, కాంగ్రెస్ అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గడ్డం వినోద్ యాదవ్ తదితరులు ఆయనను శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు.
News November 12, 2025
15న తిరుపతిలో జాబ్ మేళా

తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ కార్యాలయం మోడల్ కెరీర్ సెంటర్(MCC)లో 15వ తేదీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. 3కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని కార్యాలయ అధికారి శ్రీనివాసులు చెప్పారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, MBA పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. దాదాపు 1000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని.. ఆ రోజు ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలకు రావలని కోరారు.


