News January 24, 2025

నారాయణపేట: మూడో రోజు 13,113 దరఖాస్తులు

image

నారాయణపేట జిల్లాలో ప్రజా పాలన గ్రామ, వార్డు సభలు నిరసనలు, నిలదీతల మధ్య జరుగుతున్నాయి. మూడో రోజు 71 గ్రామ, 13 వార్డు సభలు నిర్వహించారు. జిల్లాలో మొత్తం 13,113 దరఖాస్తులు రాగా ఇందులో రేషన్ కార్డుకు 4,111, ఇళ్లకు 7,291, రైతు భరోసాకు 470, ఆత్మీయ భరోసాకు 1,241 వచ్చాయి. అర్హత ఉన్నా జాబితాలో తమ పేర్లు లేవని అధికారులను పలువురు నిలదీశారు. జాబితాలో పేరు లేని వారు మళ్లీ అప్లై చేసుకోవాలని అధికారులు సూచించారు.

Similar News

News November 25, 2025

విశాఖ ప్రజలకు గుడ్ న్యూస్

image

విశాఖకు పర్యాటక రంగంలో తలమానికంగా కైలాసగిరిపై గ్లాస్ బ్రిడ్జి నిర్మించిన విషయం తెలిసిందే. దీనిని ఎప్పుడు ప్రారంభిస్తారా? అని నగర ప్రజలతో పాటు పర్యాటకులు ఎదురు చూస్తున్నారు. ఈనెల 30 లేదా డిసెంబర్ 1న అధికారికంగా దీనిని ప్రారంభించనున్నారు. విశాఖ ఎంపీ భరత్ చేతుల మీదుగా ఓపెన్ చేస్తారని సమాచారం.

News November 25, 2025

MBNR: ఐబొమ్మ రవిపై జడ్చర్ల MLA వ్యాఖ్యలు.. మీరేమంటారు.?

image

ఐబొమ్మ రవిని ప్రజలు రాబిన్‌హుడ్ హీరోగా భావిస్తున్నారని జడ్చర్ల MLA అనిరుధ్ రెడ్డి <<18378394>>వ్యాఖ్యలు<<>> చేసిన విషయం తెలిసిందే. టికెట్ ధరలు పెంచడం తప్పనే భావనలో వారు ఉన్నారని, ₹1000 కోట్లతో తీస్తే బాగుపడేది హీరో, డైరెక్టర్, నిర్మాత అని, ₹50-100Cr పెట్టి తీయలేరా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారని అన్నారు. రవిని శిక్షించాలని కొందరంటున్నారని, కోర్టు తీర్పు ఎలా ఇస్తుందో వేచి చూడాలంటున్నారు. MLA వ్యాఖ్యలపై మీ కామెంట్.?

News November 25, 2025

ప్రకాశంలోకి అద్దంకి, కందుకూరు.. కారణం ఇదే!

image

ప్రకాశం జిల్లా నుంచి సరికొత్త జిల్లాగా మార్కాపురం ఏర్పడనున్న నేపథ్యంలో మరో కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. 2022లో జరిగిన జిల్లాల పునర్విభజనలో ప్రకాశం నుంచి అద్దంకి బాపట్లలోకి, కందుకూరు నెల్లూరులోకి వెళ్లాయి. అద్దంకి నుంచి బాపట్లకు 80 కి. మీ ఉండగా ఒంగోలుకు 40 కి.మీ మాత్రమే. కందుకూరుకు ఇదే సుదూర సమస్య. తాజాగా వీటిని ప్రకాశంలోకి కలిపేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మీ కామెంట్!