News March 22, 2025

నారాయణపేట: మోసం చేస్తున్నారు.. జర జాగ్రత్త..!

image

రుణాల పేరిట కేటుగాళ్లు మోసం చేస్తున్నారని, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. తాజాగా గద్వాల, గట్టు తదితర చోట్ల ఓ నకిలీ ఏజెంట్ తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తామని చెప్పి రైతులను మోసం చేశాడు. రుణాలు మంజూరు కావాలంటే రూ.లక్ష నుంచి రూ.4 లక్షల వరకు ముందు ఇస్తే మళ్లీ మీ ఖాతాల్లో జమవుతామని చెప్పి రూ.లక్షల్లో కొట్టేశాడు. SHARE IT

Similar News

News January 10, 2026

ప్రజావాణికి పెద్ద శంకరంపేటలో కలెక్టర్ హాజరు

image

మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ సోమవారం (జనవరి 12) పెద్ద శంకరంపేట మండల కేంద్రంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి హాజరుకానున్నారు. జిల్లా కేంద్రంతో పాటు మండల స్థాయిలో తహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహించనున్నారు. ప్రజలకు దూరభారం, ఖర్చులు తగ్గించేందుకు ఈ వినూత్న విధానం చేపట్టామని, ప్రతి వారం ఒక మండలంలో కలెక్టర్ పాల్గొంటారని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News January 10, 2026

రికార్డు సృష్టించిన జెమీమా

image

WPLలో యంగెస్ట్ కెప్టెన్‌గా జెమీమా రోడ్రిగ్స్(25y 127days) రికార్డు సృష్టించారు. ఈ సీజన్‌లో ఆమె ఢిల్లీ క్యాపిటల్స్‌కు సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. జెమీమా తర్వాతి స్థానంలో స్మృతి మంధాన(26y 230days-2023) ఉన్నారు. కాగా ఇవాళ ముంబైతో జరుగుతున్న మ్యాచులో ఢిల్లీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

News January 10, 2026

CM పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

image

CM చంద్రబాబు సంక్రాంతిని పురస్కరించుకొని 4 రోజులు పాటు ఆయన స్వగ్రామం నారావారిపల్లెలో పర్యటించనున్నారు. అలాగే పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. సంబంధిత పనులను కలెక్టర్ వెంకటేశ్వర్లు, SP సుబ్బారాయుడు శనివారం పరిశీలించారు. అనంతరం అధికారులతో సమావేశమయ్యి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పులివర్తి నాని పాల్గొన్నారు.