News March 22, 2025
నారాయణపేట: మోసం చేస్తున్నారు.. జర జాగ్రత్త..!

రుణాల పేరిట కేటుగాళ్లు మోసం చేస్తున్నారని, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. తాజాగా గద్వాల, గట్టు తదితర చోట్ల ఓ నకిలీ ఏజెంట్ తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తామని చెప్పి రైతులను మోసం చేశాడు. రుణాలు మంజూరు కావాలంటే రూ.లక్ష నుంచి రూ.4 లక్షల వరకు ముందు ఇస్తే మళ్లీ మీ ఖాతాల్లో జమవుతామని చెప్పి రూ.లక్షల్లో కొట్టేశాడు. SHARE IT
Similar News
News March 25, 2025
రేపు OTTలోకి వచ్చేస్తున్న ‘ముఫాసా’

ది లయన్ కింగ్ మూవీకి ప్రీక్వెల్గా వచ్చిన ‘ముఫాసా’ మూవీ రేపు ఓటీటీలోకి రానుంది. జియో హాట్స్టార్లో తెలుగుతో పాటు ఇంగ్లిష్, హిందీ, తమిళంలో స్ట్రీమింగ్ కానుంది. కాగా తెలుగులో ముఫాసాకు మహేశ్ బాబు, హిందీలో షారుఖ్ ఖాన్ డబ్బింగ్ చెప్పారు. డిస్నీ రూపొందించిన ఈ మ్యూజికల్ లైవ్ యాక్షన్ మూవీ గతేడాది విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది.
News March 25, 2025
జపాన్లో ఎన్టీఆర్ బిజీ బిజీ!

జపాన్లో ‘దేవర’ సినిమా విడుదల నేపథ్యంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ బిజీగా గడుపుతున్నారు. నిన్న స్పెషల్ స్క్రీనింగ్లో పాల్గొన్న ‘దేవర’.. అక్కడున్న అభిమానులతో స్టెప్పులేశారు. రెండో రోజూ ఆయన షినాగావా అక్వేరియంను సందర్శించారు. అక్కడున్న షార్క్లతో ఫొటోలు దిగుతూ కనిపించారు. క్లాసీ లుక్లో ఉన్న ఎన్టీఆర్ ఫొటోలు వైరలవుతున్నాయి.
News March 25, 2025
విశాఖ: ఫ్రీ పార్కింగ్.. ఏప్రిల్ 1 నుంచి అమలు

విశాఖలోని వాణిజ్య సముదాయలు, మాల్స్, మల్టీప్లెక్సుల్లో అడ్డగోలుగా పార్కింగ్ ఫీజును వసూలు చేయరాదని మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలు కానున్నాయి. వాణిజ్య సముదయాలలో వస్తువులు కొనుగోలు చేసి బిల్లులు చూపిస్తే 30 నిముషాలు, మల్టిఫ్లెక్స్లో సినిమా టికెట్ చూపిస్తే గంటసేపు పార్కింగ్ చేసుకోవచ్చుని ఉత్తర్వులలో పేర్కోంది.