News April 5, 2025

నారాయణపేట: రాజీవ్ యువ వికాసం కోసం యువకుల తిప్పలు

image

నిరుద్యోగ యువతను ప్రోత్సహించేందుకు, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రాజీవ్ యువవికాసం పథకానికి అప్లై చేసుకోవడం కోసం, వార్షిక ఆదాయ పత్రం తీసుకోవటానికి తహశీల్దార్ కార్యాలయానికి వెళితే అక్కడున్న అధికారులు అకారణంగా, ఎక్కువ ఆదాయాన్ని వేస్తున్నారని, జిల్లా వ్యాప్తంగా యువకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పత్రాల్లో ఆదాయం ఎక్కువగా ఉండడంతో, పథకానికి అనర్హులుగా పరిగణిస్తారని యువకులు వాపోతున్నారు.   

Similar News

News December 22, 2025

గోదావరి పుష్కరాల నిర్వహణపై కలెక్టర్ సమీక్ష

image

జిల్లాలో గోదావరి పుష్కరాల నిర్వహణకు సంబంధిత శాఖల అధికారులు ప్రణాళికలు సిద్ధంచేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ఈసందర్భంగా కలెక్టరేట్‌లో సోమవారం సమీక్షించారు. గోదావరి పుష్కరాలు 2027 జూన్‌లో నిర్వహించనున్నట్లు పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో 29 స్నానఘట్టాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. గత పుష్కరాల కన్నా రెట్టింపు మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

News December 22, 2025

విద్యార్థులకు సైన్స్ పట్ల ఆసక్తిని పెంచండి: కలెక్టర్

image

విద్యార్థులకు సైన్స్ పట్ల ఆసక్తిని పెంచి భావిభారత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలనీ కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. సుబ్బమ్మదేవి నగరపాలక ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన (సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్)ను ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య(చంటి)తో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. జిల్లా విద్యార్థులు జాతీయ స్థాయికి వెళ్లాలని కోరారు.

News December 22, 2025

అర్జీలను సకాలంలో పరిష్కరించాలి: కలెక్టర్

image

ప్రజలు అందించిన ప్రతి అర్జీని సకాలంలో పరిష్కరించి నివేదిక అందజేయాలని బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ చెప్పారు. సోమవారం బాపట్ల కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుని అర్జీలను సంబంధిత అధికారులకు అందజేసి పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.