News April 5, 2025
నారాయణపేట: రాజీవ్ యువ వికాసం కోసం యువకుల తిప్పలు

నిరుద్యోగ యువతను ప్రోత్సహించేందుకు, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రాజీవ్ యువవికాసం పథకానికి అప్లై చేసుకోవడం కోసం, వార్షిక ఆదాయ పత్రం తీసుకోవటానికి తహశీల్దార్ కార్యాలయానికి వెళితే అక్కడున్న అధికారులు అకారణంగా, ఎక్కువ ఆదాయాన్ని వేస్తున్నారని, జిల్లా వ్యాప్తంగా యువకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పత్రాల్లో ఆదాయం ఎక్కువగా ఉండడంతో, పథకానికి అనర్హులుగా పరిగణిస్తారని యువకులు వాపోతున్నారు.
Similar News
News December 17, 2025
ఎంపీలందరూ సభలో ఉండాలని కాంగ్రెస్ విప్.. జర్మనీలో రాహుల్!

MGNREGA పేరు మార్చే బిల్లు ఒకటీరెండు రోజుల్లో పార్లమెంటు ముందుకు రానుంది. ఈ క్రమంలో రానున్న 3 రోజులు హాజరుకావాలని పార్టీ ఎంపీలకు కాంగ్రెస్ విప్ జారీ చేసింది. కానీ ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ మాత్రం ప్రస్తుతం జర్మనీలో ఉండటం గమనార్హం. దీంతో రాహుల్ విషయంలో LoP అంటే లీడర్ ఆఫ్ పర్యటన్ అని బీజేపీ సెటైర్లు వేసింది. ఆయన నాన్ సీరియస్ పొలిటీషియన్ అని, శాశ్వతంగా వెకేషన్ మోడ్లో ఉంటారని విమర్శించింది.
News December 17, 2025
MBNR: ఫేస్-3 సర్పంచ్ ఎన్నికలు..UPDATE

మహబూబ్ నగర్ జిల్లాలో మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
✒133 రిటర్నింగ్ అధికారులు,13 రిజర్వ్ తో కలిపి మొత్తం 146 మంది రిటర్నింగ్ అధికారులు
✒1152 పోలింగ్ కేంద్రాలకు రిజర్వ్ తో కలిపి 1551 బ్యాలెట్ బాక్స్ లు
✒28 జోన్లకు రిజర్వ్ తో కలిపి 32 మంది జోనల్ అధికారులు
✒20 శాతం రిజర్వ్ తో కలిపి 3005 మంది పి.ఓ.లు, ఓ.పి.ఓ.లు
✒పి.ఓ.లు 2310, ఓ.పి. ఓ.లు 3386 మంది అందుబాటులో ఉన్నారు.
News December 17, 2025
ALERT..వీడియో గ్రఫీ,వెబ్ కెమెరాల ద్వారా కౌంటింగ్ రికార్డ్: కలెక్టర్

మహబూబ్ నగర్ జిల్లాలోని గ్రామ పంచాయతీ మూడో విడత ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను వీడియోగ్రాఫి నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని విసి కాన్ఫరెన్స్ హాల్ నుంచి సాధారణ ఎన్నికల పరిశీలకురాలు కాత్యాయని దేవితో కలిసి మూడో విడత ఎన్నికలు జరుగనున్న బాలానగర్ ,జడ్చర్ల, మూసాపేట, భూత్పూర్, అడ్డాకల్ మండలాల అధికారులతో వెబెక్స్ నిర్వహించి సమీక్షించారు.


