News April 5, 2025
నారాయణపేట: రాజీవ్ యువ వికాసం కోసం యువకుల తిప్పలు

నిరుద్యోగ యువతను ప్రోత్సహించేందుకు, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రాజీవ్ యువవికాసం పథకానికి అప్లై చేసుకోవడం కోసం, వార్షిక ఆదాయ పత్రం తీసుకోవటానికి తహశీల్దార్ కార్యాలయానికి వెళితే అక్కడున్న అధికారులు అకారణంగా, ఎక్కువ ఆదాయాన్ని వేస్తున్నారని, జిల్లా వ్యాప్తంగా యువకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పత్రాల్లో ఆదాయం ఎక్కువగా ఉండడంతో, పథకానికి అనర్హులుగా పరిగణిస్తారని యువకులు వాపోతున్నారు.
Similar News
News November 21, 2025
తులసికి సమర్పించకూడని నైవేద్యాలివే..

తులసి మొక్కపై లక్ష్మీ దేవి ఉంటారని నమ్ముతాం. అందుకే పూజలు చేస్తాం. అయితే ఈ దేవతకు కొన్ని నైవేద్యాలు సమర్పించడం నిషిద్ధమని పండితులు చెబుతున్నారు. శివ పూజకు వాడిన బిల్వ పత్రాలు, పారిజాత పూలు తులసికి సమర్పించకూడదట. చెరుకు రసం కూడా నిషిద్దమేనట. పాలు కలిపిన నీరు, నల్ల విత్తనాలు కూడా వద్దని సూచిస్తున్నారు. గణపతి పూజకు ఉపయోగించిన ఏ వస్తువునూ తులసికి సమర్పించకూడదనే నియమం ఉందంటున్నారు.
News November 21, 2025
మాజీ మంత్రి శైలజానాథ్కు మాతృవియోగం

శింగనమల వైసీపీ ఇన్ఛార్జి, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ తల్లి సాకే గంగమ్మ మృతి చెందారు. అనంతపురంలోని రామకృష్ణ నగర్లో నివాసం ఉంటున్న ఆమె శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. తల్లి మృతితో శైలజానాథ్ కుటుంబంలో విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు శైలజానాథ్ను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
News November 21, 2025
మరో తుఫాను ‘సెన్యార్’!

రేపు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం బలపడి తుఫానుగా మారే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. ఈ తుఫానుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సూచించిన ‘సెన్యార్’ పేరును IMD పెట్టనున్నట్లు సమాచారం. సెన్యార్ అంటే ‘లయన్’ అని అర్థం. తుఫాను ప్రభావంతో 24వ తేదీ నుంచి తమిళనాడులో, 26-29వరకు ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలకు ఛాన్స్ ఉంది. ఇటీవల ‘మొంథా’ తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపిన విషయం తెలిసిందే.


