News April 5, 2025

నారాయణపేట: సీతకు శుభాకాంక్షలు తెలిపిన డీసీసీ అధ్యక్షుడు 

image

తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్‌పర్సన్‌గా నియమితులైన కే.సీత దయాకర్ రెడ్డిని నేడు నారాయణపేట డీసీసీ అధ్యక్షుడు కే.ప్రశాంత్ కుమార్ రెడ్డితో పాటుగా పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కలిశారు. సీతా దయాకర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Similar News

News April 7, 2025

ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్

image

మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ప్రజల నుంచి 75 దరఖాస్తులు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారం నిమిత్తం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలించి వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.

News April 7, 2025

గర్భిణులకు పౌష్టికాహార కిట్లు పంపిణీ చేసిన పవన్

image

గర్బిణులు పౌష్టికాహార కిట్లను సద్వినియోగించుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. డుంబ్రిగుడ(M) పెదపాడు గ్రామ సందర్శనలో భాగంగా గ్రామంలో ఉన్న గర్భిణులకు సీమంతం, శిశువులకు అన్నప్రాసన చేశారు. వారికి బాల సంజీవని కిట్లు, గుడ్లు, పప్పు, నూనె, రైస్, చిక్కీలను పవన్ పంపిణీ చేశారు. పౌష్టికాహారంతోనే తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉంటారని సూచించారు. ఐసీడీఎస్ పీడీ సూర్యలక్ష్మీ, సీడీపీఓ నీలిమ తదితరులు ఉన్నారు.

News April 7, 2025

రాచువారిపల్లెలో విద్యుత్ షాక్‌తో రైతు మృతి

image

పుట్టపర్తి మండలంలోని రాచువారి పల్లి గ్రామ సమీపంలో విద్యుత్ షాక్‌తో రైతు నంబూరి ప్రసాద్ మృతి చెందాడు. సోమవారం గ్రామ సమీపంలోని తన పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లాడు. నియంత్రిక వద్ద ఫీజు ఎగిరిపోవడంతో దానిని వేయడానికి ప్రయత్నించాడు. ఒక్కసారిగా షాక్ సర్క్యూట్  కావడంతో అక్కడికక్కడే మృతి మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండకు తరలించారు.

error: Content is protected !!