News March 28, 2025
నారాయణపేట: ‘250 గజాల ప్లాట్కు రూ.45 లక్షల LRS’

ప్లాట్లను రెగ్యులరైజేషన్ చేసుకోవడానికి ప్రభుత్వం LRS విధానాన్ని ప్రవేశపెట్టింది. గతంలో రూ.1,000 కట్టి LRSకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు బాబోయ్ ఇదేం LRS అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. నారాయణపేట జిల్లా మరికల్ పట్టణంలో 250 గజాల భూమికి రూ.45 లక్షలు LRS రావడంతో ప్లాటు అమ్మినా అంత డబ్బు రాదని, ప్రభుత్వం పేదల కడుపు కొట్టేందుకే LRSను ప్రవేశపెట్టిందని బాధితులు మండిపడుతున్నారు.
Similar News
News October 22, 2025
సూర్యాపేట కలెక్టరేట్లో కదలని ఇందిరమ్మ ఇండ్ల ఫైల్స్

సూర్యాపేట కలెక్టరేట్లో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ఫైల్స్ ముందుకు కదలకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. జాజిరెడ్డిగూడెంకి చెందిన వికలాంగురాలు చనగాని లక్ష్మమ్మ- లింగయ్య దంపతులకు ఇల్లు మంజూరు కాగా వివరాలు తప్పుగా పడటంతో మళ్లీ MPDO తప్పును సరిచేసి కలెక్టరేట్కు పంపారు. సంబంధిత అధికారులు పత్రాలను నెలరోజులు గడుస్తున్న కన్నెత్తి చూడడం లేదు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు.
News October 22, 2025
25 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు: నెల్లూరు కలెక్టర్

నెల్లూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అధికారులందరూ అప్రమత్తంగా ఉంటూ నిరంతరం పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్ల అన్నారు. 23 నుంచి 25 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాల ప్రభావం అధికంగా ఉండనున్న నేపథ్యంలో అధికారులను, ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రజలు తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తలపై బుధవారం కలెక్టర్ ఒక ప్రకటన విడుదల చేశారు. తీర ప్రాంత మండలాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు.
News October 22, 2025
ఇతిహాసాలు క్విజ్ – 43 సమాధానాలు

1. జనకుని తమ్ముడి పేరు కుశధ్వజుడు.
2. కుంతీ కుమారుల్లో పెద్దవాడు ‘కర్ణుడు’.
3. ఊర్ధ్వ లోకాలలో మొదటి లోకం భూలోకం.
4. విష్ణువు చేతిలో ఉండే చక్రం పేరు ‘సుదర్శన చక్రం’.
5. దేవాలయాల్లో విగ్రహాలను ప్రతిష్ఠించేటప్పుడు వాటికి జీవం పోసే ఆచారం/వేడుకను ‘ప్రాణ ప్రతిష్ఠ’ అని అంటారు.
<<-se>>#Ithihasaluquiz<<>>