News April 2, 2025
నారాయణపేట: ARMY జాబ్స్ కొట్టారు.. సన్మానం

నారాయణపేట జిల్లా కేంద్రంలోని అవంగాపూర్ గ్రామానికి చెందిన లక్ష్మీకాంత్, రహిమాన్ పాషా ఆర్మీకి సెలెక్ట్ కావడంతో తోటి మిత్రులు, గ్రామస్థులు వారిని అభినందిస్తూ వారిని శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశానికి సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నామని, యువకులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి ఉద్యోగ అవకాశాలు కల్పించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News December 2, 2025
సూర్యాపేట: ‘మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు’

ప్రజల్లో రాజకీయ చైతన్యం పెరిగిందనడానికి ఇలాంటి ఫ్లెక్సీలే నిదర్శనం. చిలుకూరు మండలం పాలే అన్నారంలో మంగళవారం యరగాని రామస్వామి ఇంటి ప్రధాన ద్వారానికి ‘మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు..’ అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. గ్రామాల్లో అభివృద్ధికి పాటుపడే వారికే ఓటు వేసి తమ గ్రామాలను అభివృద్ధి చేసుకునే దిశగా అడుగులు వేయాలని రామస్వామి అన్నారు. ఈ ఫ్లెక్సీ వీక్షించిన జనాలు రామస్వామిపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
News December 2, 2025
Karnataka: సిద్ద-శివ నాటు చికెన్ ‘బ్రేక్ఫాస్ట్’

కర్ణాటక CM సిద్దరామయ్య, Dy.CM డీకే శివకుమార్ మరోసారి భేటీ అయ్యారు. ఇవాళ బెంగళూరులో శివకుమార్ ఇంట్లో ఈ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ జరిగింది. ఇడ్లీ, దోశ, ఉప్మా, నాటు చికెన్ అల్పాహారంగా తీసుకున్నారు. సుపరిపాలన, రాష్ట్ర అభివృద్ధి విషయంలో తమ నిబద్ధతను పునరుద్ఘాటించేందుకు CMకు బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేసినట్లు శివకుమార్ ట్వీట్ చేశారు. కొన్ని రోజులుగా CM అంశంపై ఇరు వర్గాల మధ్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే.
News December 2, 2025
నల్గొండ: సర్పంచి గిరీ కోసం.. రూ.లక్షల్లో ఖర్చు!

పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు, ఆశావహులు ఓట్ల వేటలో స్థాయికి మించి ఖర్చు చేయడానికి వెనుకాడడం లేదు. కొందరు భూములు, బంగారం సైతం తాకట్టు పెడుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో చిన్న చిన్న పంచాయతీల్లో సైతం ఒక్కో అభ్యర్థి రూ.నాలుగైదు లక్షలు ఖర్చు చేసే పరిస్థితి ఉంది. మామూలు పంచాయతీలో రూ.ఐదు లక్షల నుంచి రూ.పది లక్షల దాకా.. పెద్ద పంచాయతీల్లో రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల దాకా ఖర్చు చేయడానికి వెనకాడడం లేదు.


