News June 5, 2024
నారా లోకేశ్ను కలిసిన తిరుపతి ఎమ్మెల్యే

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ను తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అమరావతిలో కలిశారు. మంగళగిరి నుంచి భారీ మెజారిటీతో గెలిచిన లోకేశ్ను ఆరణి శ్రీనివాసులు దుశ్శాలువతో సత్కరించారు. తిరుపతి నుంచి ఘన విజయం సాధించిన ఆరణి శ్రీనివాసులును లోకేశ్ అభినందించారు. తిరుపతి అభివృద్ధికి అన్ని విధాలా ప్రభుత్వం సహకరిస్తుందని నారా లోకేశ్ ఆరణి శ్రీనివాసులుకు భరోసా ఇచ్చారు.
Similar News
News December 21, 2025
రేపే చిత్తూరులో లీప్ టీచర్స్ టోర్నీ

చిత్తూరు మోసానికల్ మైదానంలో ఈనెల 22న లీప్ టీచర్స్ టోర్నమెంట్ నిర్వహిస్తామని డీఈవో రాజేంద్రప్రసాద్, స్కూల్ గేమ్స్ సెక్రటరీ బాబు తెలిపారు. ఇందులో భాగంగా క్రికెట్ పోటీల్లో పురుషుల విభాగంలో పలమనేరు, చిత్తూరు, కుప్పం, నగరి, త్రోబాల్ మహిళా విభాగంలో కుప్పం, నగరి, పలమనేరు, చిత్తూరు జట్లు పాల్గొంటాయని చెప్పారు.
News December 21, 2025
చిత్తూరు మామిడి రైతులకు ముఖ్య గమనిక

మామిడి రైతులకు డిసెంబర్ నెల కీలకమని చంద్రగిరి HO అధికారిణి శైలజ అన్నారు. పూతదశకు ముందు నీటి తడులు ఆపితే చెట్టు ఒత్తిడికి లోనై మంచి పూత వస్తుందన్నారు. పిండి పురుగు పైకి ఎక్కకుండా కాండం చుట్టూ 25 సెం.మీ ప్లాస్టిక్ కవర్ కట్టి గ్రీజు రాయాలని, పూత సమంగా రావడానికి 13-0-45 నిష్పత్తిలో పొటాషియం నైట్రేట్ లీటరు నీటికి 10 గ్రా.కలిపి పిచికారీ చేయాలన్నారు. పాదుల్లో కలుపు తీసి,ఎండిన కొమ్మలు కత్తిరించాలన్నారు.
News December 21, 2025
సంక్రాంతి వస్తోంది.. చిత్తూరు జిల్లాలో జాగ్రత్త

చిత్తూరు జిల్లాలో సంక్రాంతి సందడి మొదలైంది. మహిళలు ఉదయాన్నే ముగ్గులేసి గొబ్బెమ్మలు పెడుతున్నారు. మగవాళ్లు అప్పుడే కోడిపందేలకు తెరలేపారు. పోలీసులు అయితే సైలెంట్గా ఉండరు కదా? వాళ్ల డ్యూటీ వాళ్లు చేస్తున్నారు. బైరెడ్డిపల్లి(M) నెల్లిపట్ల పంచాయతీ కక్కనూరు సమీపంలో కోడిపందెం స్థావరంపై SI చందన ప్రియ దాడి చేసి ఏడుగురిని అదుపులోకి తీసుకుని 18బైకులు, 3కోళ్లు సీజ్ చేశారు. సో కోడిపందేలకు వెళ్లకండి.


