News January 23, 2025
నార్నూర్ ప్రమాద ఘటనలో మరొకరు మృతి

నార్నూర్ మండలంలోని మాలేపూర్ ఘాట్ వద్ద ఐచర్ వాహనం ఆదివారం అదుపు తప్పిన ఘటనలో ఇప్పటికే ఇద్దరు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 47 మందికి గాయాలు కాగా వారు రిమ్స్లో చికిత్స పొందుతున్నారు. కాగా చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందగా, తాజాగా ఇంద్రవెల్లి మండలం చిత్తగూడ గ్రామనికి చెందిన ఆత్రం మల్కుబాయి (55) హైదరాబాద్లో బుధవారం సాయంత్రం మరణించారు. దీంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది.
Similar News
News December 21, 2025
RSSకు పొలిటికల్ అజెండా లేదు: మోహన్ భాగవత్

హిందూ సమాజ అభివృద్ధి, రక్షణ కోసం RSS పనిచేస్తుందని సంస్థ చీఫ్ మోహన్ భాగవత్ చెప్పారు. సంఘ్కు ఏ పొలిటికల్ అజెండా లేదని, సమాజాన్ని చైతన్యపరిచి భారత్ను మరోసారి ‘విశ్వగురు’ చేయాలనేదే టార్గెట్ అన్నారు. RSS గురించి మాట్లాడే హక్కు అందరికీ ఉంటుందని, అయితే అవి వాస్తవికత ఆధారంగా ఉండాలన్నారు. సంఘ్ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని కోల్కతాలోని సైన్స్ సిటీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు.
News December 21, 2025
టీడీపీ అరకు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షురాలిగా తేజోవతి

టీడీపీ పార్టీ అరకు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షురాలిగా మోజోరు తేజోవతిని నేడు పార్టీ అధిష్ఠానం నియమించింది. ఉపాధ్యాయ ఉద్యోగాన్ని వదిలి టీడీపీలో చేరిన తేజోవతి పార్టీ బలోపేతానికి గ్రామస్థాయిలో కృషి చేయడంతో ఈ బాధ్యతను అప్పగించారు. తేజోవతి ప్రస్తుతం గిరిజన సలహా మండలి సభ్యురాలిగా వ్యవహరిస్తున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా లక్ష్మణరావును పార్టీ అధిష్ఠానం నియమించింది.
News December 21, 2025
డ్రాగన్ ముప్పుకు ‘ద్వీప’ కవచం: అమెరికా మాస్టర్ ప్లాన్!

A2/AD వ్యూహంతో అమెరికా నౌకలకు చైనా సవాల్ విసురుతున్న వేళ పెంటగాన్ తన పాత EABO వ్యూహానికి పదును పెడుతోంది. భారీ నౌకలపై ఆధారపడకుండా పసిఫిక్ ద్వీపాల్లోని WW-II నాటి ఎయిర్ఫీల్డ్స్ను పునరుద్ధరిస్తోంది. తద్వారా విస్తారమైన ప్రాంతంలో క్షిపణులను మోహరిస్తూ, తైవాన్ రక్షణే లక్ష్యంగా చైనా చుట్టూ ఒక రక్షణ వలయాన్ని సిద్ధం చేస్తోంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ఒత్తిడిని ఎదుర్కోవడంలో ఇది కీలకంగా మారనుంది.


