News January 23, 2025

నార్నూర్ ప్రమాద ఘటనలో మరొకరు మృతి

image

నార్నూర్ మండలంలోని మాలేపూర్ ఘాట్ వద్ద ఐచర్ వాహనం ఆదివారం అదుపు తప్పిన ఘటనలో ఇప్పటికే ఇద్దరు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 47 మందికి గాయాలు కాగా వారు రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. కాగా చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందగా, తాజాగా ఇంద్రవెల్లి మండలం చిత్తగూడ గ్రామనికి చెందిన ఆత్రం మల్కుబాయి (55) హైదరాబాద్‌లో బుధవారం సాయంత్రం మరణించారు. దీంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది.

Similar News

News December 12, 2025

IMF షరతులతో పాక్ ఉక్కిరిబిక్కిరి

image

పాకిస్థాన్‌‌కు విడతల వారీగా నిధులు విడుదల చేస్తామని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్(IMF) 7 బిలియన్ డాలర్లు బెయిలవుట్ ప్యాకేజీని ప్రకటించింది. అలాగే దశలవారీగా కండిషన్స్ కూడా పెడుతోంది. తాజాగా మరో 11 షరతులు పెట్టడంతో మొత్తం నిబంధనల సంఖ్య 64కు చేరింది. వీటిని 18 నెలల్లో అమలు చేయాలి. వీటిలో మొదటిది కరప్షన్ కట్టడికై కేంద్ర ప్రభుత్వ అధికారుల ఆస్తుల వివరాలు ఈ ఏడాది చివరినాటికి ప్రకటించేలా డెడ్ లైన్ విధించింది.

News December 12, 2025

సలీల్ అరోరా.. 39 బంతుల్లోనే సెంచరీ

image

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మరో శతకం నమోదైంది. ఝార్ఖండ్‌తో మ్యాచ్‌లో పంజాబ్ బ్యాటర్ సలీల్ అరోరా కేవలం 39 బంతుల్లోనే సెంచరీ చేశారు. సలీల్ చేసిన 125 రన్స్‌లో 102(11 సిక్సులు, 9 ఫోర్స్) పరుగులు బౌండరీల ద్వారానే వచ్చాయి. అటు 19వ ఓవర్లో సలీల్, గౌరవ్ రెచ్చిపోయారు. వరుసగా 4, 6, 6, 1, 6, 4(27 రన్స్) బాదేశారు. IPLలో అరోరా వికెట్ కీపర్ కేటగిరీలో రూ.30 లక్షల బేస్ ప్రైస్‌తో లిస్ట్ అయ్యి ఉన్నారు.

News December 12, 2025

నిర్మల్: పరీక్షను పగడ్బందీగా నిర్వహించాలి

image

నిర్మల్ జిల్లాలో శనివారం నిర్వహించే నవోదయ పరీక్షను పగడ్బందీగా నిర్వహించాలని ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ ముడారపు పరమేశ్వర్ సూచించారు. జిల్లాలో పరీక్ష కేంద్రాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 1552 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారని వారందరికీ పరీక్ష కేంద్రాలను సిద్ధం చేసినట్లు తెలిపారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు గంట ముందుగానే చేరుకోవాలన్నారు.