News February 4, 2025
నార్సింగి: దంపతుల మృతితో పిల్లలు అనాథలు

మెదక్ జిల్లాలో నెల రోజుల వ్యవధిలో <<15350285>>దంపతుల మృతి<<>> ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. గత నెల 11న నార్సింగి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ అనారోగ్యంతో చనిపోగా ఆయన భార్య జ్యోతి నిన్న గుండెపోటుతో మృతి చెందింది. దీంతో వీరి కొడుకు, కూతురు తల్లిదండ్రులు లేని అనాథలుగా మిగిలారు. కొడుకు మృతిని తట్టుకోలేక శ్రీనివాస్ గౌడ్ తల్లి 2రోజుల క్రితం పక్షవాతంతో ఆస్పత్రిలో చేర్చారు.
Similar News
News January 4, 2026
మెదక్: టెట్ పరీక్ష ప్రశాంతం: డీఈవో విజయ

మెదక్ జిల్లా నర్సాపూర్ బీవీఆర్ఐటీ కళాశాలలో నిర్వహించిన ఉపాధ్యాయ అర్హతకు టెట్ పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు డీఈవో విజయ తెలిపారు. ఆదివారం రెండో రోజులో భాగంగా మొదటి పేపర్కు 100, రెండో పేపర్కు 100 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా మొదటి పేపర్కు 48 మంది హాజరు కాగా మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షకు 71 మంది హాజరైనట్లు చెప్పారు. 81 మంది గైర్హాజరయ్యారన్నారు.
News January 4, 2026
అసెంబ్లీలో సీఎం రేవంత్ వ్యాఖ్యలపై హరీష్ రావు ధ్వజం

అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. అసభ్యకరమైన భాష, అబద్ధాల వరదతో ప్రజాస్వామ్య దేవాలయాన్ని అవమానించారని విమర్శించారు. బీఆర్ఎస్ న్యాయపోరాట ఫలితాలను సీఎం తన ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటన్నారు. ఇరిగేషన్ అంశాల్లో సీఎం అజ్ఞానం బయటపడిందని పేర్కొంటూ చేసిన ఆరోపణలకు పూర్తి సాక్ష్యాలతో తెలంగాణ భవన్ వేదికగా పీపీటీలో సమాధానం ఇస్తానని హరీష్ రావు స్పష్టం చేశారు.
News January 4, 2026
అసెంబ్లీలో సీఎం రేవంత్ వ్యాఖ్యలపై హరీష్ రావు ధ్వజం

అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. అసభ్యకరమైన భాష, అబద్ధాల వరదతో ప్రజాస్వామ్య దేవాలయాన్ని అవమానించారని విమర్శించారు. బీఆర్ఎస్ న్యాయపోరాట ఫలితాలను సీఎం తన ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటన్నారు. ఇరిగేషన్ అంశాల్లో సీఎం అజ్ఞానం బయటపడిందని పేర్కొంటూ చేసిన ఆరోపణలకు పూర్తి సాక్ష్యాలతో తెలంగాణ భవన్ వేదికగా పీపీటీలో సమాధానం ఇస్తానని హరీష్ రావు స్పష్టం చేశారు.


