News February 4, 2025

నార్సింగి: దంపతుల మృతితో పిల్లలు అనాథలు

image

మెదక్ జిల్లాలో నెల రోజుల వ్యవధిలో <<15350285>>దంపతుల మృతి<<>> ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. గత నెల 11న నార్సింగి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ అనారోగ్యంతో చనిపోగా ఆయన భార్య జ్యోతి నిన్న గుండెపోటుతో మృతి చెందింది. దీంతో వీరి కొడుకు, కూతురు తల్లిదండ్రులు లేని అనాథలుగా మిగిలారు. కొడుకు మృతిని తట్టుకోలేక శ్రీనివాస్ గౌడ్ తల్లి 2రోజుల క్రితం పక్షవాతంతో ఆస్పత్రిలో చేర్చారు.

Similar News

News January 22, 2026

మెదక్: ఒంటరిగా జీవించలేక యువకుడి సూసైడ్

image

భార్యతో విడిపోయి ఒంటరిగా జీవించలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన టేక్మాల్ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తంపూలూరు గ్రామానికి చెందిన ప్రశాంత్ కొన్ని రోజుల క్రితం భార్యతో గొడవతో పెద్దల సమక్షంలో విడిపోయాడు. అప్పటి నుంచి మనస్తాపంతో తాగుడుకు బానిసైన ప్రశాంత్.. సోమవారం గ్రామ శివారులో పురుగు మందు తాగాడు. గమనించి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు.

News January 22, 2026

మెదక్ నుంచి ఢిల్లీలో పోటీలకు ఎంపిక

image

మెదక్ డిగ్రీ కళాశాల విద్యార్థులు క్రీడల్లో సత్తా చాటారు. ఉస్మానియా యూనివర్సిటీ అంతర్ కళాశాలల క్రాస్ కంట్రీ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించి జాతీయ స్థాయికి ఎంపికయ్యారని ప్రిన్సిపల్ హుస్సేన్ తెలిపారు. ఫిబ్రవరిలో ఢిల్లీలో జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారని పేర్కొన్నారు. విద్యార్థులను అదనపు ఎస్పీ మహేందర్ ప్రత్యేకంగా అభినందించారు. కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

News January 22, 2026

మెదక్ నుంచి ఢిల్లీలో పోటీలకు ఎంపిక

image

మెదక్ డిగ్రీ కళాశాల విద్యార్థులు క్రీడల్లో సత్తా చాటారు. ఉస్మానియా యూనివర్సిటీ అంతర్ కళాశాలల క్రాస్ కంట్రీ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించి జాతీయ స్థాయికి ఎంపికయ్యారని ప్రిన్సిపల్ హుస్సేన్ తెలిపారు. ఫిబ్రవరిలో ఢిల్లీలో జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారని పేర్కొన్నారు. విద్యార్థులను అదనపు ఎస్పీ మహేందర్ ప్రత్యేకంగా అభినందించారు. కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.