News November 17, 2024
నాలుగు ఉద్యోగాలు సాధించిన కేశరాజుపల్లి వాసి

నల్గొండ పట్టణ పరిధి కేశరాజుపల్లికి చెందిన ప్రేమ్ – సునీతల కుమారుడు ప్రణబ్ నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. 2019లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, 2020లో ఫైర్మెన్, 2024 ఎక్సైజ్ కానిస్టేబుల్గా ఉద్యోగం సాధించాడు. ఇటీవల ప్రకటించిన గ్రూప్-4లో రెవెన్యూ శాఖలో ఉద్యోగం సాధించాడు. ఎక్సైజ్ కానిస్టేబుల్గా కొనసాగుతున్న ప్రణబ్ రెవెన్యూ శాఖలో చేరనున్నట్లు తెలిపారు.
Similar News
News March 9, 2026
వచ్చిన నీరు వచ్చినట్టే పాయే.. గొంతు ఎండనుందా!

ఈ ఏడాది వేసవి కాలం జిల్లా ప్రజలకు చుక్కలు చూపించేలా ఉంది. ముఖ్యంగా తాగునీటి విషయంలో గండం పొంచి ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాకు ప్రధాన నీటి వనరైన నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటి లభ్యత ఆశాజనకంగా లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఈ నెల నుంచి జూన్ వరకు తాగునీటి అవసరాలకే సుమారు 65.49 టీఎంసీలు అవసరం కాగా, నిల్వలు మాత్రం కనిష్ఠ స్థాయికి చేరువలో ఉన్నాయి.
News March 9, 2026
నల్గొండ: పల్లె వనాలు ఆహ్లాదకరంగా ఉండాలి: కలెక్టర్

గ్రామాల్లోని పల్లె ప్రకృతి వనాలు సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచేలా ఉండాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. ఆదివారం చందనపల్లిలోని ప్రకృతి వనం, డంపింగ్ యార్డును ఆయన తనిఖీ చేశారు. వనాల్లో నీడనిచ్చే చెట్లతో పాటు రంగురంగుల పూల మొక్కలను పెంచాలని, ప్రజలు, పిల్లలు సేదతీరేలా వాటిని తీర్చిదిద్దాలని సూచించారు. పరిసరాలను నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
News March 9, 2026
నల్గొండ: పల్లె వనాలు ఆహ్లాదకరంగా ఉండాలి: కలెక్టర్

గ్రామాల్లోని పల్లె ప్రకృతి వనాలు సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచేలా ఉండాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. ఆదివారం చందనపల్లిలోని ప్రకృతి వనం, డంపింగ్ యార్డును ఆయన తనిఖీ చేశారు. వనాల్లో నీడనిచ్చే చెట్లతో పాటు రంగురంగుల పూల మొక్కలను పెంచాలని, ప్రజలు, పిల్లలు సేదతీరేలా వాటిని తీర్చిదిద్దాలని సూచించారు. పరిసరాలను నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.


