News March 17, 2025

నాలుగు పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు: DEO

image

జిల్లాలో రేపటి నుంచి ప్రారంభ‌మ‌య్యే ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లకు ఏర్పాట్లు చేసిన‌ట్లు DEO మాణిక్యం నాయుడు, రాష్ట్ర ప‌రిశీల‌కుడిగా జిల్లాకు వచ్చిన విద్యాశాఖ అధికారి టెహ‌రా సుల్తానా చెప్పారు. ఆదివారం విజయనగరం కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నాలుగు కేంద్రాల్లో ప్ర‌యోగాత్మ‌కంగా సీసీ టీవి కెమెరాల‌ను అమ‌ర్చామన్నారు. 9 ఫ్ల‌యింగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేశామ‌న్నారు.

Similar News

News March 17, 2025

ప‌క‌డ్బంధీగా ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించాలి: కలెక్టర్

image

ప‌క‌డ్బంధీగా ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించాల‌ని విజయనగరం జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ అంబేడ్కర్ ఆదేశించారు. సోమ‌వారం నుంచి ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ప్రారంభ‌మైన నేప‌థ్యంలో, ప‌లు ప‌రీక్షా కేంద్రాల‌ను ఆయ‌న త‌నిఖీ చేశారు. ముందుగా కంటోన్మెంటులో సెయింట్ ఆన్స్ బాలికోన్న‌త పాఠ‌శాల‌ను, మున్సిప‌ల్ ఉన్న‌త‌ పాఠ‌శాల‌ను ఆయ‌న సంద‌ర్శించారు. త‌ర‌గ‌తి గ‌దుల‌ను ప‌రిశీలించారు.

News March 17, 2025

గుర్లలో నకిలీ ఏసీబీ డీఎస్పీ బెదిరింపులు

image

గుర్ల మండలంలో పలువురు అధికారులను గుర్తు తెలియని ఓ నకిలీ ఏసీబీ అధికారి హడలెత్తించినట్లు సమాచారం. తాను ఏసీబీ DSPని అంటూ పరిచయం చేసుకొని డబ్బులు డిమాండ్ చేశాడు. పలువురు అధికారులకు ఆదివారం ఫోన్ చేసి మీరు అవినీతికి పాల్పడుతున్నారని, అరెస్ట్ చేస్తామంటూ బెదిరింపులకు దిగాడు. రూ.2లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అయితే ఈ ఘటనపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని గుర్ల SI నారాయణరావు తెలిపారు.

News March 17, 2025

విజయనగరం జిల్లా ప్రజలకు హెచ్చరిక

image

విజయనగరం జిల్లాలో మంగళవారం, బుధవారం అధిక ఉష్ణోగ్రతలు నమోదుయ్యే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. బాడంగి, బొబ్బిలి, బొండపల్లి, దత్తిరాజేరు, గజపతినగరం, గరివిడి, గుర్ల, L కోట, మెంటాడ, మెరకముడిదాం, రాజాం, రామభద్రాపురం,సంతకవిటి, తెర్లాం, వంగర, S కోట మండల్లో 40 డిగ్రీల నమోదు అవ్వొచ్చని పేర్కొంది. వడగాల్పులు సైతం వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

error: Content is protected !!