News December 29, 2024
నాలుగో విడత రుణమాఫీకి రైతుల ఎదురుచూపులు

ఉమ్మడి జిల్లాలో నాలుగో విడత రుణమాఫీ కోసం అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో 11,301 మంది రైతులకు రూ.110 కోట్లు, సిద్దిపేట జిల్లాలో రూ.95 కోట్లకు అర్హులైన 9,063 మంది రైతులు నాలుగో విడత జాబితా కింద పేర్లు ఉన్నాయి. మెదక్ జిల్లాలో రూ.56 కోట్లకు అర్హులైన 7వేల మంది రైతులను లబ్ధిదారుల జాబితాలో గుర్తించారు. తమ ఖాతాలో ప్రభుత్వం నగదు ఎప్పుడు జమ చేస్తుందోనని వారు చూస్తున్నారు.
Similar News
News November 17, 2025
మెదక్: సొసైటీ డైరెక్టర్ మృతి

చిన్న శంకరంపేట మండలం జంగారాయి సొసైటీ డైరెక్టర్ సిద్ది రెడ్డి అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సిద్ది రెడ్డి మృతితో గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. మృతి చెందిన సిద్ది రెడ్డి కుటుంబాన్ని సొసైటీ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డితో పాటు డైరెక్టర్లు వివిధ పార్టీల రాజకీయ నాయకులు పరామర్శించారు.
News November 17, 2025
నర్సాపూర్: ‘బాల్య వివాహాలపై సమాచారం ఇవ్వండి’

బాల్య వివాహాలను ప్రోత్సహిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని నర్సాపూర్ ఎస్సై రంజిత్ రెడ్డి హెచ్చరించారు. బాల్య వివాహాలపై ఆదివారం నర్సాపూర్లో ఫంక్షన్ హాల్ యజమానులు, ఫోటోగ్రాఫర్లు, పురోహితులు, బ్యాండ్ బాజా వారికి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మైనర్ బాలబాలికలకు వివాహాలు జరిగితే అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. వివాహాలు చేసే ముందు వారి వయసు వివరాలను తప్పనిసరిగా సేకరించాలని తెలిపారు.
News November 16, 2025
కుటుంబానికి మూలశక్తి స్త్రీ: సత్యవాణి

భారతీయ కుటుంబానికి మూలశక్తి స్త్రీయే అని సామాజిక ఆధ్యాత్మికవేత్త భారతీయం సత్యవాణి అన్నారు. రామాయంపేట శిశు మందిర్లో సప్తశక్తి సంగం నిర్వహించారు. ప్రపంచ దేశాల్లో ఎక్కడలేని కుటుంబ వ్యవస్థ కేవలం మన భారతదేశంలోనే ఉందన్నారు. కుటుంబ బాధ్యతను అత్యంత సమర్థంగా నిర్వహించే శక్తి మహిళకే ఉంటుందని పేర్కొన్నారు. పిల్లలను ఉత్తములుగా తీర్చిదిద్దడంలో మహిళ పాత్రే అత్యంత కీలకమన్నారు.


