News April 18, 2024
నా గెలుపును ఎవరూ ఆపలేరు: ఈటల రాజేందర్

మల్కాజిగిరి పార్లమెంట్ బరిలో తన గెలుపును ఎవరూ ఆపలేరని BJP అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. నామినేషన్ దాఖలుకు ముందు తన ఇంటి వద్ద ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. మల్కాజిగిరిలో ధర్మానికి, అధర్మానికి జరిగే యుద్ధమే ఈ ఎన్నికలు అని అభివర్ణించారు. కొందరు దొంగ సర్వేలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఈటల ఆరోపించారు.
Similar News
News November 15, 2025
గచ్చిబౌలి స్టేడియంలో రెజోఫెస్ట్ 2025

గచ్చిబౌలి స్టేడియంలో 2 రోజుల రెజోఫెస్ట్ 2025 ముగిసింది. నిన్న ముఖ్యఅతిథిగా 48th ఛీప్ జస్టిస్ NV రమణ హాజరై 16 రెజోనెన్స్ కొత్త స్కూల్స్ ప్రారంభించారు. విజ్ఞాన్ యూనివర్సిటీ ఛైర్మన్ లావు రత్తయ్య, శాంత బయోటెక్నోస్ ఛైర్మన్ వరప్రసాద్రెడ్డి, యాక్టర్లు సాయిదుర్గ తేజ్, మౌళి, దర్శకుడు అనిల్ రావిపూడి విద్యార్థులకు లక్ష్య సాధన గురించి వివరించారు. నిన్న 35 క్యాంపస్ల విద్యార్థులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు.
News November 15, 2025
HYD: ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎప్పటి నుంచంటే!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్ ఎత్తివేతకు రంగం సిద్ధమైంది. అక్టోబర్ 6న అధికారులు కోడ్ను అమల్లోకి తెచ్చారు. ఎన్నికల నామినేషన్ల నుంచి కౌంటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించారు. రేపటితో ఎన్నికల కోడ్ ముగియనుంది. ఇక సోమవారం నుంచి ప్రభుత్వ పథకాలు, ఇతర అభివృద్ధి పనులు మొదలుకానున్నాయి. 17వ తేదీ నుంచి GHMC ‘ప్రజావాణి’ పునరుద్ధరించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
News November 15, 2025
ఢిల్లీకి నవీన్ యాదవ్.. మతలబ్ ఏంటి?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచిన నవీన్ యాదవ్కు ఢిల్లీలో ప్రశంసలు వచ్చాయి. CM రేవంత్, dy.CM భట్టి, PCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్తో కలిసి ఆయన రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేను కలిశారు. జూబ్లీలోని బస్తీ వాసులు గెలిపించిన నాయకుడు ఢిల్లీకి వెళ్లడం తాజా రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. పట్టులేని చోట కాంగ్రెస్ను నిలబెట్టిన యూసుఫ్గూడ బస్తీ వాసికి అదనపు బాధ్యతలు ఏమైనా అప్పగిస్తారా? అనే చర్చ మొదలైంది.


