News April 11, 2024
‘నా జీవితం తెరిచిన పుస్తకం’: మాజీ మంత్రి కొప్పుల

నా జీవితం ఒక తెరిచిన పుస్తకం లాంటిదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. గురువారం ఆయన ధర్మపురి పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మాట్లాడారు. మూడు రోజుల క్రితం ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ తనపై చేసిన వ్యాఖ్యలకు దీటుగా స్పందించారు. నా ఆస్తులు లెక్కపెట్టడానికి గెలిచినవా? లేక ప్రజల సమస్యలు పరిష్కరించడానికి గెలిచినవా? అని ప్రశ్నించారు. పెండింగ్లో ఉన్న పనులను పూర్తిచేయాలని డిమాండ్ చేశారు.
Similar News
News December 18, 2025
అక్రమంగా వైద్య సేవలు అందిస్తున్న ఇద్దరిపై కేసు: కేశవపట్నం ఎస్ఐ

శంకరపట్నం మండలంలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా వైద్య సేవలు అందిస్తున్న ఇద్దరు వ్యక్తులపై తెలంగాణ మెడికల్ ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ యాక్టివ్ నేషనల్ మెడికల్ మిషన్ ఆక్ట్ ప్రకారం కేసు నమోదు చేసినట్లు కేశవపట్నం ఎస్సై కట్కూరి శేఖర్ రెడ్డి గురువారం తెలిపారు. అనుమతులు లేకుండా వైద్య సేవలు అందిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. కేశవపట్నం గ్రామంలో అంజయ్య, ప్రభాకర్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.
News December 18, 2025
కరీంనగర్ డిఎంఅండ్ హెచ్వోకు ఆశా వర్కర్ల వినతి

ఆశా వర్కర్లకు క్షయవ్యాధి సర్వే పెండింగ్ బిల్లులు తక్షణమే అందించాలని కోరుతూ కరీంనగర్ డిఎంఅండ్ హెచ్వో కార్యాలయంలో జిల్లా వైద్యాధికారి వెంకటరమణకు వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో డిసెంబర్ 18వ తేదీ నుండి లెప్రసీ సర్వే ప్రారంభం కానుందని జిల్లా సీఐటీయూ ఉపాధ్యక్షుడు రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీలత అన్నారు. రెండేళ్లుగా పెండింగ్లో ఉన్న సర్వే బిల్లులు చెల్లించాకే విధులకు హాజరవుతామని హెచ్చరించారు.
News December 18, 2025
జమ్మికుంట మార్కెట్కు మూడు రోజులు సెలవు

జమ్మికుంట మార్కెట్కు శుక్రవారం అమావాస్య సందర్భంగా సెలవు, శని, ఆదివారల్లో సాధారణ సెలవు ఉంటుందని తిరిగి మార్కెట్ సోమవారం ప్రారంభం అవుతుందని మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి రాజా తెలిపారు. గురువారం మార్కెట్కు రైతులు 19 వాహనాల్లో 144 క్వింటాళ్ల విడి పత్తి విక్రయానికి తీసుకురాగా గరిష్ఠంగా రూ.7,450, కనిష్ఠంగా రూ.6,800 పలికింది. తాజాగా పత్తి ధర నిన్నటి కంటే ఈరోజు రూ.100 పెరిగింది.


