News May 16, 2024
నా వివరణ తీసుకోకుండానే అనర్హత వేటు వేశారు: జంగా

ఎమ్మెల్సీ పదవి విషయంలో వివరణ తీసుకోకుండానే మండలి ఛైర్మన్ తనను అనర్హుడిగా ప్రకటించినట్లు జంగా కృష్ణమూర్తి ఆరోపించారు. గురువారం గుంటూరులో గృహనిర్బంధంలో ఉన్న జంగా మీడియాతో మాట్లాడారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించిన వల్లభనేని వంశీ, మద్దాలి గిరిపై పార్టీ ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. బలహీనవర్గాలకు చెందినవాడిని కావడం వల్లనే తనపై వివక్ష చూపుతున్నారని జంగా ఆవేదన వ్యక్తం చేశారు
Similar News
News April 23, 2025
అమరావతి: ఒకప్పటి ధాన్యకటకం గురించి తెలుసా..?

అమరావతి ప్రాచీనంగా ధాన్యకటకం అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. శాతవాహనుల్లో గౌతమీపుత్ర శాతకర్ణి కాలంలో(సా.శ. 1వ శతాబ్దం) ఈప్రాంతం బౌద్ధ, జైన మతాలకు ప్రముఖ కేంద్రంగా మారింది. బౌద్ధ విశ్వవిద్యాలయం, బౌద్ధరామాలు, స్థూపాలు అమరావతిని ప్రాచుర్యంలోకి తెచ్చాయి. శాతవాహన పాలకులు దీన్ని రాజధానిగా వాడారు. బౌద్ధుడి కాలచక్ర బోధనలకు కేంద్రంగా అమరావతి నిలిచింది. వజ్రయాన గ్రంథాల్లో అమరావతికి చారిత్రక ప్రామాణికత ఉంది.
News April 23, 2025
ANU: ఇంజినీరింగ్ మొదటి సెమిస్టర్ ఫలితాలు విడుదల

నాగార్జున వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన మొదటి సెమిస్టర్ 1/4 ఫలితాలను వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు మంగళవారం విడుదల చేశారు. ఎంబీఏ,ఇంటర్నేషనల్ బిజినెస్ స్టడీస్ రీవాల్యూయేషన్ ఫలితాలను కూడా విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. బీటెక్ 4/1, 4/4 సెమిస్టర్ల పరీక్ష ఫలితాలను బుధవారం విడుదల చేసేందుకు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఫలితాలు www.anu.ac.in లో అందుబాటులో ఉన్నాయన్నారు.
News April 23, 2025
గుంటూరు డాక్టర్ అరుదైన రికార్డు

NTR హెల్త్ యూనివర్సిటీ విడుదల చేసిన ఫలితాల్లో గుంటూరు GGH న్యూరాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ గాజుల రామకృష్ణ కార్డియాలజీలో సూపర్ స్పెషాలిటీ పీజీ పూర్తి చేశారు. జనరల్ మెడిసిన్, పల్మనరీ మెడిసిన్, న్యూరాలజీతో పాటు కార్డియాలజీ పీజీలు పూర్తిచేసిన ప్రపంచంలోనే తొలి డాక్టరుగా అరుదైన గౌరవం పొందారు. వేమూరు(M) చావలికి చెందిన రామకృష్ణ గుంటూరులో విద్యాభ్యాసం పూర్తిచేసి, ప్రభుత్వ వైద్య సేవల్లో అనేక బాధ్యతలు చేపట్టారు